Fuel Crisis: దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్.. కేంద్రం కీలక ప్రకటన..
- దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు..
- ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు..
- పెట్రోల్, డీజిల్ భయాల మధ్య కేంద్రం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Crisis: ప్రజలు పెట్రోల్, డీజిల్ విషయంలో కంగారు పడొద్దని కేంద్రం సూచించింది. కొరతపై వస్తున్న వదంతులతో ప్రజలు ఆందోళన పడొద్దని కోరింది. దేశంలో రాబోయే 2 నెలలకు (60 రోజులకు) సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఇప్పటికే సిద్ధమైనట్లు పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ముందుగానే దిగుమతులను ఖరారు చేసుకున్నాయి, దీంతో సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకుంటున్నాయని తెలిపింది.
Read Also: JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్కు 1 నెల ఫ్రీ..!
Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
పశ్చిమాసియా పరిణామాలు, ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశంలో ఇంధన సంక్షోభంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో వాహనాదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, పట్టణాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. అయితే, దేశంలో ఎలాంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు పానిక్ కావద్దని చెబుతోంది. హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసినా.. భారత్ 40కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో నడుస్తున్నాయని చెప్పింది.
భారతదేశంలో మొత్తం నిల్వల సామర్థ్యం 74 రోజులకు సరిపోగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాస్తవ నిల్వలు సుమారు 60 రోజులకు సరిపడా ఉన్నాయి. మరోవైపు, భూగర్భ గుహల్లో భారత వ్యూహాత్మక నిల్వలు కూడా ఉన్నాయి. గల్ఫ్ నుంచి ఎల్పీజీ గ్యాస్ సరఫరా తగ్గినప్పటికీ భారత్ రష్యా, యూఎష్ఏ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి భారీగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఈ మార్గాల ద్వారా ఎల్పీజీ దేశానికి వప్తోంది. తప్పుడు సమచారం వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!