Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Fast Tracks Business Visas For Chinese Executives As Us Tariffs Bite Ties Thaw

India-China: చైనా బిజినెస్ వీసాల వేగం పెంచిన భారత్.. కారణాలు ఇవే..

Published Date :December 12, 2025 , 5:39 pm
By Venu Goapl Reddy
  • బలపడుతున్న భారత్, చైనా సంబంధాలు..
  • భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం..
  • చైనా బిజినెస్ వీసాల ప్రక్రియ వేగవంతం..
India-China: చైనా బిజినెస్ వీసాల వేగం పెంచిన భారత్.. కారణాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-China: అమెరికాతో సుంకాలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా, చైనా బిజినెస్ వీసాల ప్రక్రియ వేగాన్ని పెంచింది. చైనా ఎగ్జిక్యూటివ్‌లకు బిజినెస్ వీసాలు సమయాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. పరిపాలన తనిఖీలు తగ్గించడం ద్వారా, భారత్ ఒక నెల రోజుల్లోనే చైనా సంస్థలకు బిజినెస్ వీసాలను జారీ చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. సాధారణ ప్రయోజనాల దృష్ట్యా ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి భారత్ నుంచి వస్తున్న సానుకూల చర్యల్ని గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సులభతర మార్పిడిని పెంచడానికి భారత్‌తో నిరంతరం సంప్రదింపులు నిర్వహించడానికి చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు.

2020లో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడం, గల్వాన్ ఘర్షణ వల్ల భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గల్వాన్ నదిలోయలో పాంగాంగ్ సరస్సు సమీపంలో భారత్ నిర్మిస్తున్న రహదారిని అడ్డుకునేందుకు చైనా సైనికులు దూకుడుగా వ్యవహరించడంతో గల్వాన్ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో 20 మందికి పైగా భారతీయులు మరణించారు. ఆ తర్వాత భారత సైనికులు జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో చైనా సైనికులు మరణించినట్లు వెస్ట్రన్ మీడియా వెల్లడించింది. అయితే, చైనా తన మరణాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించింది లేదు. 1975 తర్వాత సరిహద్దుల్లో గల్వాన్ ఘర్షణ మొదటిది.

Also Read

  • Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
  • Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
  • Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
  • Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

Read Also: CM Chandrababu Delhi visit: మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు

అయితే, మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో.. చైనా, భారత్ ఎల్ఏసీ వెంట ఉన్న కార్ప్స్ కమాండర్ల మధ్య చర్చలు ప్రారంభించాయి. దౌత్య, సైనిక చర్చల ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. 2024లో పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒప్పందంతో, డిసెంబర్ 2024 నాటికి డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో సైనికులు వైదొలిగారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు నార్మల్ కావడం ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉంటే, అమెరికా తీరు భారత్-చైనా సంబంధాలు మరింత బలపడేందుకు సాయపడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం సుంకాలను విధించడంతో, భారత్ తన ఉత్పత్తుల కోసం వేరే మార్కెట్ల కోసం చూస్తోంది. ఇది చైనా వైపు భారత్ చూసేందుకు సహాయపడింది. ప్రస్తుతం, భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం బలంగా ఉంది, కానీ రెండు దేశాల మధ్య అసమతుల్యత ఉంది. రెండు దేశాల మద్య 2025 ఆర్థిక సంవత్సరంలో 127.7 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. అమెరికా తర్వాత, చైనాకు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. FY26 ప్రారంభంలో (ఏప్రిల్-జూలై 2025) భారత ఎగుమతులు 19.97% పెరిగి 5.75 బిలియన్ డాలర్లుగా ఉంటే, దిగుమతులు 40.65 బిలియన్ డాలర్లు ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bilateral trade India China
  • Chinese business visa
  • Chinese investments in India
  • Galwan Valley 2020
  • India China ties US tariffs impact

తాజావార్తలు

  • Manoj Tiwary: “హార్దిక్ పాండ్యా ఒంటరి అయిపోయాడు”.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!

  • Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..

  • NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమాకు అనిరుధ్ సంగీతం?

  • AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..

  • SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్‌దే పైచేయి

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions