E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
- భారత ఇంధన రంగం కీలక పరివర్తన దిశగా..
- E85 పెట్రోల్పై ముందుకు వెళ్తున్న కేంద్రం..
- పెట్రోల్లో 85 శాతం ఇథనాలు, 15 శాతం పెట్రోల్ ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E85 Petrol: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభం భారత్లో ఇంధన రంగాన్ని అతలాకుతలం చేసింది. దేశంలో గ్యాస్, పెట్రోల్-డీజిల్పై ప్యానిక్ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ పరిస్థితిని అధిగమించేందుకు కీలక అడుగు వేస్తోంది. పెట్రోల్లో అధిక మొత్తంలో ఇథనాల్ను కలపడానికి సంబంధించిన నిబంధనల్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది అమలయితే భవిష్యత్తులో E85 పెట్రోల్తో వాహనాలు నడిచే అవకాశం ఉంది.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ముసాయిదా నిబంధనల్లో పెట్రోల్లో 85 శాతం ఇథనాల్ కలిపే E85 ఫ్యూయల్ను చేర్చారు. E100ను కూడా ప్రతిపాదించారు, అంటే భవిష్యత్తులో పూర్తిగా ఇథనాల్తో వాహనాలను నడపొచ్చు. ఈ మార్పు భారత్లో ఇందన వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పటి వరకు భారత్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి E20 పెట్రోల్ వాడుతున్నారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
Read Also: UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ప్రభుత్వం ఈ ముసాయిదానున ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ప్రజలు, పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. సూచనలు, సలహాలు తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. గతేడాడి ఏప్రిల్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాలు కలిపి E20 పెట్రోల్ను దేశవ్యాప్తంగా తీసుకువచ్చారు. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో భారత్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటుంది.
ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు, కానీ ఇది అమలు కావాలంటే ఈ85 పెట్రోల్కు అనుగుణంగా వాహనాల ఇంజన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాుడతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. వీటి స్థానంలో తయారీదారులు వీలైనంత త్వరగా బయోఫ్యూయల్స్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ఖరీదైనవి మాత్రమే కాకుండా దేశానికి తీవ్రమైన సమస్యగా కూడా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!