E85 Petrol: పెట్రోల్లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
- భారత ఇంధన రంగం కీలక పరివర్తన దిశగా..
- E85 పెట్రోల్పై ముందుకు వెళ్తున్న కేంద్రం..
- పెట్రోల్లో 85 శాతం ఇథనాలు, 15 శాతం పెట్రోల్ ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E85 Petrol: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభం భారత్లో ఇంధన రంగాన్ని అతలాకుతలం చేసింది. దేశంలో గ్యాస్, పెట్రోల్-డీజిల్పై ప్యానిక్ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ పరిస్థితిని అధిగమించేందుకు కీలక అడుగు వేస్తోంది. పెట్రోల్లో అధిక మొత్తంలో ఇథనాల్ను కలపడానికి సంబంధించిన నిబంధనల్ని ప్రతిపాదిస్తూ కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది అమలయితే భవిష్యత్తులో E85 పెట్రోల్తో వాహనాలు నడిచే అవకాశం ఉంది.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ ముసాయిదా నిబంధనల్లో పెట్రోల్లో 85 శాతం ఇథనాల్ కలిపే E85 ఫ్యూయల్ను చేర్చారు. E100ను కూడా ప్రతిపాదించారు, అంటే భవిష్యత్తులో పూర్తిగా ఇథనాల్తో వాహనాలను నడపొచ్చు. ఈ మార్పు భారత్లో ఇందన వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుంది. ఇప్పటి వరకు భారత్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి E20 పెట్రోల్ వాడుతున్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
ప్రభుత్వం ఈ ముసాయిదానున ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేసింది. ప్రజలు, పరిశ్రమ వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. సూచనలు, సలహాలు తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. గతేడాడి ఏప్రిల్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాలు కలిపి E20 పెట్రోల్ను దేశవ్యాప్తంగా తీసుకువచ్చారు. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో భారత్ తన ఇంధన అవసరాల కోసం పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటుంది.
ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు, కానీ ఇది అమలు కావాలంటే ఈ85 పెట్రోల్కు అనుగుణంగా వాహనాల ఇంజన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఒక కార్యక్రమంలో మాట్లాుడతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. వీటి స్థానంలో తయారీదారులు వీలైనంత త్వరగా బయోఫ్యూయల్స్, ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ఖరీదైనవి మాత్రమే కాకుండా దేశానికి తీవ్రమైన సమస్యగా కూడా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!