Covid 19: దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత మూడు వారాలుగా కేసులు క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 2,541 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మరో 30 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,522గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,22,223కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
వారం కిందటి వరకు దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు వెలుగు చూశాయి. అయితే వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్ధాన్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. గత వారంలో దేశ రాజధాని ఢిల్లీలో 6,300కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ కారణంగానే ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..