ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో కేసులు తగ్గాయి. ఇండియలో తాజాగా 38,628 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,18,95,385 కి చేరింది. ఇందులో 3,10,55,861 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 617 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,27,371 మంది మృతి చెందారు. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో 40,017 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. దేశంలో 24 గంటల్లో 49,55,138 మందికి టీకాలు అందించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు దేశంలో 50,10,09,609 మందికి టీకాలు వేశారు.