India-Canada: కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్
- భారత్- కెనడాల మధ్య క్షిణిస్తున్న దౌత్య సంబంధాలు.. కెనడాలో మరిన్ని కాన్సులర్ క్యాంపులను రద్దు చేసిన భారత్ భారతీయులను అండగా ఉంటామని ఇండియన్ ఎంబసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో.. టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. నవంబరు 2, 3 తేదీల్లో బ్రాంప్టన్, సర్రేలోని రెండు శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హైకమిషన్ కొన్ని కాన్సులర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది.
Read Also: PAC Chairman Election: పీఏసీ ఎన్నిక.. చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే..!
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
కాగా, గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు 4,000 మంది భారత్- కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కోల్పోయిన.. వారికి తాము అండగా ఉంటామని కాన్సులేట్ ప్రకటించింది. ఇక, బ్రాంప్టన్లోని హిందూ సభా దేవాలయం ఆవరణలోకి ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు. అంటారియో ప్రావిన్స్కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో కెనడాలో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్టు వారెంట్లు జారీ
ఇక, సిక్కులు ఫర్ జస్టిస్, నిషేధిత ఖలిస్థానీ అనుకూల సమూహం.. పరిపాలనా సేవలలో సహాయం చేయడానికి వచ్చిన భారతీయ కాన్సులర్ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నాయి. అలాగే, కెనడాలోని భారతీయులకు అవసరమైన సేవలను ఇండియన్ ఎంబసీ అందిస్తోంది. వీటిని భారత వ్యతిరేక శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే, గత సెప్టెంబరులో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కుట్రలో భారత రాయాబారుల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆ తర్వాత నుంచి భారత్- కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!