Divorce Temple: విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం ఎక్కడుందో తెలుసా?
- జపాన్ లో విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divorce Temple: ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాలు వాటి గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందగా, కొన్ని వాటి మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో దేవతలకు, దేవుడులకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ, ప్రపంచంలోని ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది.
Also Read: Jail Sentence : గంజాయి మొక్కలు సాగు చేసిన వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష..
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
సాధారణంగా, ప్రజలు తమ కోరికలను నెరవేర్చడానికి, దేవుడి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు వెళతారు. కానీ, జపాన్లో ఒక ఆలయం ‘ విడాకుల ఆలయం’ అని పిలుస్తారు. గృహ హింస లేదా అఘాయిత్యాలకు గురైన మహిళలకు ఈ ఆలయం స్వర్గధామం. శతాబ్దాల క్రితం జపాన్లో మహిళల హక్కులు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించారని సమాచారం. మహిళలు ఇక్కడికి రావడంతో శారీరకంగా, మానసికంగా కోలుకోవడమే కాకుండా సామాజిక మద్దతు కూడా పొందారు. నేటికీ ఈ ఆలయం మహిళా సాధికారతకు ప్రతీక.
జపాన్ లో మహిళలు ఎటువంటి హక్కులు లేని సమయంలో పురుషులు తమ భార్యలకు సులభంగా విడాకులు ఇచ్చే సమయంలో, ఈ ఆలయం గృహహింసతో బాధపడుతున్న మహిళలకు ఆశ్రయం కల్పించింది. భర్త క్రూరత్వానికి గురై పారిపోతున్న ప్రతి స్త్రీకి గుడి తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడికి రావడం వల్ల వారికి శారీరక భద్రత మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక శాంతి, సాంత్వన లభించే వాతావరణం కూడా లభించింది. ఈ ఆలయం ఇప్పటికీ అలాంటి అణచివేతలను ఎదుర్కొంటున్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది జపాన్ లోని కమకురా నగరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం. దీని చరిత్ర సుమారు 700 ఏళ్ల నాటిది. ఈ ఆలయాన్ని ‘విడాకుల దేవాలయం’ అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని బౌద్ధ సన్యాసిని కకుసన్ తన భర్త హోజో టోకిమున్తో కలిసి నిర్మించారు. ఆ తర్వాత కకుసన్ స్వయంగా విడాకుల విషయంలో చిక్కుకుంది. అందుకే, భర్త నుంచి విడిపోయి మహిళలు శాంతియుతంగా జీవించే చోటు కల్పించాలని నిర్ణయించుకుంది.
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
స్త్రీలు తమ భర్తలను విడిచిపెట్టే ముందు మూడు సంవత్సరాల పాటు ఈ ఆలయంలో ఉండవచ్చు. కాలక్రమేనా తర్వాత ఈ వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. ఇక్కడ ఉండడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా స్వావలంబన పొందే అవకాశం కూడా లభించింది. చాలా ఏళ్లుగా ఈ ఆలయంలోకి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ, 1902లో ఎంగాకు-జీ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, మగ మఠాధిపతిని నియమించారు. దాంతో పురుషులు కూడా ప్రవేశించడం ప్రారంభించారు.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!