PM Modi: ‘‘ఒక సంవత్సరం, ఒక ప్రధాని’’.. ఇండియా కూటమిపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ‘‘ఒక సంవత్సరం, ఒక ప్రధాని’’ సూత్రాన్ని అవలంభిస్తోందని ఆరోపించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఏర్పాట్లు భారతదేశాన్ని అపహాస్యం చేస్తాయని బుధవారం మోడీ అన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానం పరిధిలోని హర్దాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలు ఉద్దేశిస్తూ మాట్లాడిన పీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్లలో ఐదుమంది ప్రధానుల ఫార్ములా కోసం ఓటర్లు సిద్ధంగా ఉన్నారా..? అని ప్రజలని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమి ప్రమాదకమైన గేమ్ ఆడుతోందని అన్నారు. నాయకత్వ విషయంలో బీజేపీలో స్పష్టత ఉన్నప్పటికీ.. ఇండియా కూటమిలో స్పష్టత లోపించిందని ఆయన చెప్పారు. ఇండియా కూటమి నేతలు దేశ పగ్గాలు ఎవరికి అప్పగించాలని అనుకుంటున్నారనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో మోడీ అనేది తెలిసిపోయింది, మరి వాళ్ల సంగతేంటి అని ప్రశ్నించారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also:The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!
“‘ఒక ఏడాది, ఒక ప్రధాని’ ఫార్ములాపై ఇండియా కూటమిల నేతల మధ్య చర్చ జరుగోతందని మీడియా కథనాలు వచ్చాయని, అంటే ఒక ఏడాది ఒక ప్రధాని, రెండో ఏడాది రెండో ప్రధాని, ఇలా ఐదో ఏడాది ఐదో ప్రధాని, ఇండియా కూటమి ప్రధాని కుర్చీని వేలం వేసే పనిలో నిమగ్నమై ఉంది.” అని ఇండియా కూటమిపై ప్రధాని విరుచుకుపడ్డారు. పగటి కలలు కంటున్న నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు.
మరోవైపు ‘సంపద పునర్విభజన’పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తోందని ఆరోపించారు. రాజకుటుంబం సలహాదారు(శామ్ ప్రిట్రోడా) వారసత్వ పన్ను విధించాలని అంటున్నాడని, ‘‘ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ కార్లు, మోటార్ సైకిళ్ళు లేదా ఇల్లు కలిగి ఉంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది జప్తు చేస్తుంది’’ అని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!