PM Narendra Modi: గ్రీన్ ఎనర్జీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: పునరుత్పాదక ఇంధనం బంగారం గనుల కన్నా తక్కువేం కాదని.. ఇందులో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ గ్రోత్పై యూనియన్ బడ్జెట్ 2023-24లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..గ్రీన్ ఎనర్జీలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని వాటాదారులను ఆహ్వానిస్తున్నానని అన్నారు. భారతదేశం సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుందని, నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రైవేట్ రంగానికి రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని తెలిపారు.
Read Also: Taraka Ratna: నా జీవితంలో నువ్వే బెస్ట్… తారకరత్న గురించి అలేఖ్య ఎమోషనల్ పోస్ట్
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ప్రస్తుత బడ్జెట్ ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ మార్కెట్ లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెడుతుందని అన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిండంతో పాటు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగుతామని ప్రధాని మోదీ అన్నారు. ఈ బడ్జెట్ లో గ్రీన్ ఎనర్జీకి కేటాయింపులు మన భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు పునాది రాయి అని అన్నారు. భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో అత్యంత వేగంగా పురోగమిస్తోందని ప్రధాని చెప్పారు.
షెడ్యూల్ కంటే ఐదు నెలల ముందే భారత్ 10 శాతం ఇథనాల్ కలపడం లక్ష్యాన్ని సాధించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. షెడ్యూల్ కంటే తొమ్మిదేళ్ల ముందుగానే 40 శాతం నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోవడం గురించి మాట్లాడారు. భారత్ బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని 125 గిగావాట్లకు పెంచాలని ఆయన పేర్కొన్నారు.2030 నాటికి 500 గిగావాట్స్ పునరుత్పాదక శక్తిని భారత్ కలిగి ఉండాని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇథనాల్ మిశ్రమం, పీఎ కుసుమ్ పథకం, సోలార్ తయారీ ప్రోత్సహించడం, రూఫ్ టాప్ సోలార్ స్కీమ్, ఈవీ బ్యాటరీ వంటి నిర్ణయాలను తీసుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..