Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి..
- ఇంధన ధరల పెరుగుదలతో సంక్షోభంలో దేశ విమానయాన పరిశ్రమ..
- భారీగా నష్టాలు వస్తాయని విమాన సంస్థల ఆందోళన..
- కేంద్రానికి ఎయిర్ ఇండియా లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airlines Crisis: ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం భారత విమానయాన రంగాన్ని సంక్షోభానికి గురిచేస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల మూలంగా ఎయిర్లైన్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యలో ఇంధన ధరల కారణంగా విమాన కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా సహా కనీసం మూడు ఎయిర్లైన్స్ ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నాయి. విమాన ఇంధనం ‘‘ఏవియేషణ్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలను సవరించాలని కోరాయి. విమాన కార్యకలాపాల ఖర్చులో 40 శాతం ఖర్చు ఇంధనానిదే ఉంటుంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులలో ఇది 55–60% వరకు పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన ధరలు ప్రస్తుతం ప్రతీ కిలోలీటర్ కు రూ. 2 లక్షలకు పైగా చేరాయి.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
ఈమేరకు విమాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఇంధన ధరలు పెరిగితే ఎయిర్లైన్స్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఫ్లైట్లను రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్ జెట్ కేంద్రానికి లేఖ రాశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రూట్లపై ప్రభావం ఎక్కువగా ఉందని, ఇలాగే కొనసాగితే రూట్లలో ఫ్లైట్లను నిలిపేయడం లేదా తగ్గించడం చేయాల్సి వస్తుందని ఎయిర్లైన్స్ చెబుతున్నాయి.
దేశీయ, అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలు సమానంగా ఉండాలని, తాత్కాలికంగా 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని వాయిదా వేయాలని, కొన్ని ప్రాంతాల్లో 25 శాతం వరకు ఉండే రాష్ట్ర స్థాయి వ్యాట్ను తగ్గించాలని, ఇంధన ధరల పెరుగుదలపై నియంత్రణ ఉండాలని కొన్ని కీలక డిమాండ్లు చేశాయి. ఇరాన్ యుద్ధం వల్లే ఈ ఇంధన ధరల పెరుగుదల నమోదవుతోంది. ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని అడ్డుకోవడంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి వచ్చే చమురుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలో చమురు, గ్యాస్ రవాణా 20 శాతం జరుగుతోంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?