Kerala: ఆ ఆలయంలో ఛాయ్నే తీర్థం.. ప్రసాదంగా పెసర గుడాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: గుడికి వెళ్లిన వారు.. దేవుడిని దర్శించుకున్న తరువాత గుడిలో పెట్టే ప్రసాదం తీసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గుడికి వెళ్లిన వారికి సాదారణంగా గుళ్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం, అరటిపండు ఇస్తారు. ప్రసాదంతోపాటు తీర్థం ఇస్తారు. దాదాపు అన్ని దేవాలయాల్లో ఇలానే తీర్థ, ప్రసాదాలు ఇస్తుంటారు. కానీ ఆ ఆలయంలో ఇచ్చే తీర్థం వెరైటీ.. అక్కడ పెట్టే ప్రసాదం కూడా వెరైటీనే. అవేంటో అనుకుంటున్నారా? అక్కడ ఛాయ్ ని తీర్థంగా ఇస్తారు.. ఇక ప్రసాదంగా అయితే పెసర గుడాలను ఇస్తారు. అదేంటీ ఇదేదో వింతగా ఉందనుకుంటున్నారా? వీటిని తీర్థ ప్రసాదాలుగా ఇస్తున్న గుడి ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
Read also: Durga devi stotram: ఆషాఢమాసం, భానుసప్తమి సందర్భంగా ఈ స్తోత్రాలు వింటే సంతాన సౌభాగ్యాలు
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో సమర్పిస్తే దానిని తాను సంతోషంగా స్వీకరిస్తానని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ తను బోధించిన గీతలో చెబుతాడు. అయితే వాటికి అదనంగా తేనీరు(చాయ్) కూడా జతచేర్చారు కేరళీయులు. పరమాత్మకు నివేదించిన ఉష్ణోదకాన్ని ఆ గుడికి వచ్చేవారందరికీ ప్రసాదంగా పంచుతుంటారు. ఏకాక్షరికి ఇంతటి ఘనత కట్టబెట్టిన ఆలయం పేరు ముత్తప్పన్ కోవెల. కేరళలోని కన్నూరు జిల్లా పరాసినిక్కడవు గ్రామంలో ఉంటుందీ గుడి. ఇక్కడ వెలసిన ముత్తప్పన్ ఆదివాసీల ఆరాధ్య దైవం. హరిహరుల అంశగా ఈ స్వామిని కొలుస్తారు. ముత్తప్పన్ను అయ్యప్పగా భావిస్తారు కొందరు.
Read also: Health Tips: రోజూ వెల్లుల్లిని ఇలా చేసుకొని తాగండి.. ఏమౌతుందో మీరే చూడండి..
ఉత్తర మలబారులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న పరాసినిక్కడవులో ముత్తప్పన్ ఆలయం మరింత ప్రత్యేకం. ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయిక్కడ. అందులో పాలుపంచుకోవడానికి కేరళ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు అక్కడికి వస్తుంటారు. ఈ సంగతి పక్కనపెడితే, ఇక్కడ తేనీటిని నైవేద్యంగా సమర్పించడం, ప్రసాదంగా భక్తులకు పంచడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ
తేనీటితోపాటు పెసర సొండెలు ప్రసాదంగా అందిస్తారు. వినడానికి వింతగా ఉన్నా.. నేటికీ ఇక్కడ తేనీరే తీర్థంగా ఇస్తారు. ఆ మాటకొస్తే ఉదయం పూట కాచే తొలి టీని దేవుడి పటం ముందుంచి నైవేద్యం పెట్టే కుటుంబాలు మన దగ్గరా కనిపిస్తాయి. ఈ ఉష్ణోదకం ముందు అమృతం కూడా దిగదుడుపే.. అందుకే టీ నివేదనం అంటారు తేనీటి ప్రేమికులు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?