BJP: ఎంపీలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. రూ.100కు 100 యూనిట్ల విద్యుత్ హమీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. దశాబ్ధంకు పైగా అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరోసారి ఎంపీని కైవసం చేసుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా.. ప్రజల్ని ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Read Also: Virat Kohli: రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..! అనుష్క శర్మ బేబీ బంప్ వీడియో వైరల్
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్రం కోసం తన మేనిఫెస్టోను ప్రకటించింది. విద్యుత్, గ్యాస్ సిలిండర్లతో పాటు రైతులను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 5 ప్రధాన హమీలను ఇచ్చింది.
* రాష్ట్రంలో ప్రతీ ఇంటికి రూ. 100కి 100 యూనిట్ల విద్యుత్ అందించడం.
* ఉజ్వల యోజన, లాడ్లీ బెహనా లబ్ధిదారులకు సిలిండర్ రూ. 450 అందించడంతో పాటు లాడ్లీ బెహనా యోజన కింద అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతీ నెల రూ. 1250 జమ చేస్తామని హామీ ఇచ్చింది.
* పేద కుటుంబాలకు చెందిన బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు కూడా ఉచిత విద్య అందించబడుతుంది.
* రైతుల నుంచి గోధుమలను క్వింటాల్కి రూ. 2700, వరిని రూ. 3100 చొప్పున కొనుగోలు చేస్తామని హమీ ఇచ్చింది.
* ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడానికి రూ. 20,000 కోట్లు పెట్టబడి పెట్టనున్నట్లు బీజేపీ తెలిపింది. ఆస్పత్రులు, ఐసీయూల్లో బెడ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని చెప్పింది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ప్రచార దూకుడును పెంచింది. నవంబర్ 17న పోలింగ్ జరగనుంది, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!