Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ పంటలకు మంచిదే.. లిక్కర్తో వ్యవసాయం ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
Read Also: Kriti Kharbanda : శృతి మించిన కృతి.. ఆందాల ఆరబోత కాదు పారబోతే
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
పెసర వంటి పప్పు ధాన్యాలతో పాటు పసుపు పంటకు ఇలా దేశీ లిక్కర్ ను పిచికారీ చేస్తున్నారు. చాలా మంది రైతులు 100 మిల్లీమీటర్లు దేశీ మద్యాన్ని 15 లీటర్ల నీటితో కలిపి పంట వేసిన తర్వాాత ఒకసారి పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువుల కన్నా ఇది మంచిగా పనిచేయడంతో పాటు చౌకగా ఉంటుందని చెబుతున్నారు. దిగుబడి పెరిగిందని రైతులు చెబుతున్నారు. నర్మదాపురంలోని నాయకెడకు చెందిన ప్రేంశంకర్ పటేల్ పంట దిగుబడిని పెంచడానికి, కొద్ది మొత్తంలో మద్యాన్ని నీటిలో కలిపి తన పంటపై పిచికారీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పంట బాగా పెరుగుతోందని, ఉత్పత్తి పెరుగడంతో పాటు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
పురుగుల మందు పిచికారీ చేయాలంటే ఖర్చు ఎకరాకు రూ. 100-150 అవుతుంటే.. దేశీ మద్యం వల్ల రూ.10-12 మాత్రమే ఖర్చు అవుతుందని అక్కడి రైతులు చెబుతున్నారు. బిచువా గ్రామానికి చెందిన ఘాసిరాం మాట్లాడుతూ, ఈ టెక్నిక్ దిగుబడి పరిమాణాన్ని మాత్రమే కాకుండా దాని నాణ్యత కూడా పెరుగుతుందని అన్నారు. కోరోజెన్, అమిడా, అసిడా, థియో వంటి క్రిమిసంహారక మందులు మార్కెట్లో రూ. 1200 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. ఇదే దేశీమద్యం అయితే రూ. 100-150 రేంజులో దొరుకుతుందని.. రైతులు ఎక్కువగా మహావా మద్యాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. దీని ధర కేవలం రూ.80 మాత్రమే. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!