Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ పంటలకు మంచిదే.. లిక్కర్తో వ్యవసాయం ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
Read Also: Kriti Kharbanda : శృతి మించిన కృతి.. ఆందాల ఆరబోత కాదు పారబోతే
Also Read
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
పెసర వంటి పప్పు ధాన్యాలతో పాటు పసుపు పంటకు ఇలా దేశీ లిక్కర్ ను పిచికారీ చేస్తున్నారు. చాలా మంది రైతులు 100 మిల్లీమీటర్లు దేశీ మద్యాన్ని 15 లీటర్ల నీటితో కలిపి పంట వేసిన తర్వాాత ఒకసారి పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువుల కన్నా ఇది మంచిగా పనిచేయడంతో పాటు చౌకగా ఉంటుందని చెబుతున్నారు. దిగుబడి పెరిగిందని రైతులు చెబుతున్నారు. నర్మదాపురంలోని నాయకెడకు చెందిన ప్రేంశంకర్ పటేల్ పంట దిగుబడిని పెంచడానికి, కొద్ది మొత్తంలో మద్యాన్ని నీటిలో కలిపి తన పంటపై పిచికారీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పంట బాగా పెరుగుతోందని, ఉత్పత్తి పెరుగడంతో పాటు ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
పురుగుల మందు పిచికారీ చేయాలంటే ఖర్చు ఎకరాకు రూ. 100-150 అవుతుంటే.. దేశీ మద్యం వల్ల రూ.10-12 మాత్రమే ఖర్చు అవుతుందని అక్కడి రైతులు చెబుతున్నారు. బిచువా గ్రామానికి చెందిన ఘాసిరాం మాట్లాడుతూ, ఈ టెక్నిక్ దిగుబడి పరిమాణాన్ని మాత్రమే కాకుండా దాని నాణ్యత కూడా పెరుగుతుందని అన్నారు. కోరోజెన్, అమిడా, అసిడా, థియో వంటి క్రిమిసంహారక మందులు మార్కెట్లో రూ. 1200 నుంచి రూ.1800 వరకు ఉన్నాయి. ఇదే దేశీమద్యం అయితే రూ. 100-150 రేంజులో దొరుకుతుందని.. రైతులు ఎక్కువగా మహావా మద్యాన్ని నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నారు. దీని ధర కేవలం రూ.80 మాత్రమే. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!