Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ మొదలు.. కీలకంగా 6 అంశాలు..
- కోల్కతా వైద్యురాలి కేసులో సీబీఐ విచారణ మొదలు..
- 6 అంశాలపై దృష్టి సారించిన అధికారులు..
- నిందితుడితో పాటు పలువురు స్టేట్మెంట్లు రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి నిన్న అప్పగించింది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యాన్ని తూర్పారపట్టింది. హత్యాచారం జరిగిన తర్వాత పరిపాలన అధికారులు యాక్టివ్గా స్పందించకపోవడాన్ని ఎత్తిచూపింది. గత శుక్రవారం కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు.
మహిళా ప్రైవేట్ భాగాల నుంచి, ముక్కు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం వచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ ఎముక విరిగినట్లు తేలింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. ఆమె పెదవులు, ఉంగరపు వేలిపై గాయాలతో పాటు ముఖంపై గోటి రక్కిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే, ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన సమయంలో మృతదేహం దొరికిన సెమినార్ హాలు నుంచి ఇతను బయటకు రావడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో పాటు సంఘటన స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్ఫోన్ ఇతడి మొబైల్తో ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Andhra Pradesh: వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లకు బిగ్ షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు
ఇదిలా ఉంటే ఈ కేసులు సీబీఐ విచారణ ప్రారంభించింది. ముఖ్యంగా 6 అంశాలపై సీబీఐ దృష్టిసారించినట్లు తెలుస్తో్ంది. 1) వైద్యురాలిపై ఒక వ్యక్తి లేదా అనేక మంది అత్యాచారం చేశారా..?, 2) నిందితుడు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నాడా..?, 3) సంఘటన తర్వాత సాక్ష్యాలు నాశనం చేయబడటం, 4) హత్య ఎందుకు ముందుగా ఆత్మహత్యగా నివేదించబడింది..?, 5) ఆస్పత్రి పరిపాలన ప్రమేయం ఉందా..?, 6) వైద్యురాలి హత్య రాత్రి జరిగితే ఉదయమే ఎందుకు పోలీసుకు సమాచారం ఇచ్చారు..? అనే అనుమానాలపై ముందుగా విచారించనున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ తరుపున వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులతో కూడి టీం కోల్కతాలో ఉంది. సీబీఐ SC1, లేదా స్పెషల్ క్రైమ్ యూనిట్, వేలిముద్రలు, పాదముద్రలు మరియు ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాల కోసం నేరస్థలాన్ని పరిశీలిస్తుందని, ఇది నిందితుడి ఉనికిని నిర్ధారిస్తుందని అధికారులు చెబుతున్నారు. నేరం జరిగిన స్థలంలో ఉన్నవారిని గుర్తించడానికి బెంగాల్ రాష్ట్ర పోలీసులు సాక్ష్యాలు సమీక్షించడానికి, సంజయ్ రాయ్ స్టేట్మెంట్ని మళ్లీ రికార్డు చేయడానికి సీబీఐ టీం మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తోంది. ఘటన జరిగిన రాత్రి ఆమెతో డిన్నర్ చేసిన నలుగురు, పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు, వైద్యులతో సహా ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ స్నేహితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫులేజీని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!