Taliban: యంగ్ స్టూడెంట్ని ఇండియాలో రాయబారిగా నియమించిన తాలిబాన్లు..
- యంగ్ స్టూడెంట్ని ఇండియాలో రాయబారిగా నియమించిన తాలిబాన్లు..
- భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్ని ముంబైలో తమ దేశం తరుపున రాయబారిగా నియమించింది. ఆఫ్ఘాన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ని ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్లో యాక్టింగ్ కాన్సుల్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లను భారత్ గుర్తించలేదు. తాజాగా తాలిబాన్లు భారత్లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్దే అవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత భారతదేశం తన దౌత్యవేత్తలను కాబూల్తో పాటు ఆ దేశంలోని ఇతర నగరాల నుంచి ఉపసంహరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించిన దౌత్యవేత్తలు భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
అయితే, భారత్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో అక్కడి ప్రజలకు అవసరమైన వస్తువులు భారత్ నుంచి వెళ్లాయి. తాలిబన్లు కూడా భారత్ని పలు సందర్భాల్లో పొగిడారు. తమ దేశంలో దౌత్యవేత్తలను నియమించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి JP సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించి కాబూల్లో తాలిబాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్తో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత మిస్టర్ కామిల్ నియామకం జరిగింది. తాలిబాన్ రాజకీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ మంగళవారం ఎక్స్లో మిస్టర్ కామిల్ నియామకాన్ని ప్రకటించారు.
కమిల్ భారత్లో ఏడేళ్లు చదువుకున్నాడు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన స్కాలర్షిప్పై ఢిల్లీలోని దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ను అభ్యసించారు. అతను ముంబైలో ఉన్నాడని ఇప్పటికే తన విధులు నిర్వర్తిస్తున్నాడని సమాచారం. భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ.. అతను భారత దేశంలో ఆప్ఘన్ల కోసం పనిచేస్తున్న ఆఫ్ఘన్ జాతీయుడిగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?