Taliban: యంగ్ స్టూడెంట్ని ఇండియాలో రాయబారిగా నియమించిన తాలిబాన్లు..
- యంగ్ స్టూడెంట్ని ఇండియాలో రాయబారిగా నియమించిన తాలిబాన్లు..
- భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కీలక పరిణామం..
Taliban: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్ని ముంబైలో తమ దేశం తరుపున రాయబారిగా నియమించింది. ఆఫ్ఘాన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ని ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్లో యాక్టింగ్ కాన్సుల్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లను భారత్ గుర్తించలేదు. తాజాగా తాలిబాన్లు భారత్లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్దే అవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న తర్వాత భారతదేశం తన దౌత్యవేత్తలను కాబూల్తో పాటు ఆ దేశంలోని ఇతర నగరాల నుంచి ఉపసంహరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించిన దౌత్యవేత్తలు భారతదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
అయితే, భారత్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో అక్కడి ప్రజలకు అవసరమైన వస్తువులు భారత్ నుంచి వెళ్లాయి. తాలిబన్లు కూడా భారత్ని పలు సందర్భాల్లో పొగిడారు. తమ దేశంలో దౌత్యవేత్తలను నియమించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి JP సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించి కాబూల్లో తాలిబాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్తో చర్చలు జరిపిన కొద్ది రోజుల తర్వాత మిస్టర్ కామిల్ నియామకం జరిగింది. తాలిబాన్ రాజకీయ వ్యవహారాల డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ మంగళవారం ఎక్స్లో మిస్టర్ కామిల్ నియామకాన్ని ప్రకటించారు.
కమిల్ భారత్లో ఏడేళ్లు చదువుకున్నాడు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన స్కాలర్షిప్పై ఢిల్లీలోని దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ను అభ్యసించారు. అతను ముంబైలో ఉన్నాడని ఇప్పటికే తన విధులు నిర్వర్తిస్తున్నాడని సమాచారం. భారత్ అధికారికంగా స్పందించనప్పటికీ.. అతను భారత దేశంలో ఆప్ఘన్ల కోసం పనిచేస్తున్న ఆఫ్ఘన్ జాతీయుడిగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!