Taliban: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఒక యంగ్ స్టూడెంట్ని ముంబైలో తమ దేశం తరుపున రాయబారిగా నియమించింది. ఆఫ్ఘాన్ విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ని ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్లో యాక్టింగ్ కాన్సుల్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబాన్లను భారత్ గుర్తించలేదు. తాజాగా తాలిబాన్లు భారత్లో చేసిన తొలి నియామకం ఇక్రముద్దీన్దే అవుతుంది.