Imran Khan: “నో-ఫ్లై” లిస్టులో ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ వదిలిపోకుండా చర్యలు..
Imran Khan: ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచుకు చేరిన పాకిస్తాన్ పరిస్థితి, రాజకీయ అస్థిరతతో సతమతం అవుతోంది. అక్కడి ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ తిరుగుబాటు చేస్తున్నారు. ఇటీవల ఆయన అరెస్ట్ సమయంలో, ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, క్వెట్టా, పెషావర్ నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆర్మీ కంటోన్మెంట్లే టార్గెట్ గా దాడులు చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఉన్నా.. సైన్యమే పరోక్షంగా అధికారం చెలాయిస్తోంది. నెమ్మనెమ్మదిగా అల్లర్లలో పాల్గొన్నవారిని అరెస్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, ఆయన పార్టీకి క్రమంగా రాజీనామాలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ బెదిరింపులతో ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు దూరం అవుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ విదేశాలకు ప్రయాణించకుండా ‘నో-ఫ్లై’ జాబితాలోకి ఇమ్రాన్ ఖాన్ ను తీసుకువచ్చింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Reservoir: ఫోన్ రిజర్వాయర్లో పడిందని.. 1500 ఎకరాలకు సరిపోయే నీటిని తోడేశాడు..
విదేశాల్లో తనకు ఎలాంటి ఆస్తులు, వ్యాపారాలు లేవని, బ్యాంకు అకౌంట్లు లేవని విదేశాలకు వెళ్లే ఆలోచన లేదని, తనను నో ఫ్లై జాబితాలో ఉంచినందుకు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ.. థాంక్స్ చెప్పారు ఇమ్రాన్ ఖాన్. ఆయన భార్య బుష్రాబీబీ, ఇతర పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీకి చెందిన పలువురు నేతలు దేశం వదిలి వెళ్లకుండా నిషేధించింది. మే 9న పాకిస్తాన్ లో జరిగిన హింస నేపథ్యంలో పీటీఐ పార్టీపై నిషేధం విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం.. మొత్తం 600 పీటీఐ నాయకులపై నో-ఫ్లై జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా పీటీఐ పార్టీకి చెందిన వారు దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని వారిని అడ్దుకున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ జాబితాలో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ పేరు కూడా ఉంది. వీరితో పాటు కీలక నేతలైన మురాద్ సయీద్, మలీకా బొఖారీ, ఫవాద్ చౌదరి, హమ్మద్ అజార్, ఖాసిం సూరి, అసద్ ఖైజర్, యాస్మిన్ రషీద్ మరియు మియాన్ అస్లాం ఇక్బాల్ పేర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!