PM Modi: గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ముఖ్యం
PM Modi: దేశంలోని గ్రామాల్లో గ్రామపంచాయతీరాజ్ వ్యవస్థను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాంతీయ పంచాయతీరాజ్ కౌన్సిల్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఫరీదాబాద్లోని సూరజ్కుండ్లో జరిగిన కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధన్ఖడ్ తదితరులతో కలిసి మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనం చేసిందని ప్రధాని విమర్శించారు.
Read also: Kushi : ట్రైలర్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం ఎంత అవసరమో కాంగ్రెస్కు అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత ఏర్పాటైన జిల్లా పంచాయతీ వ్యవస్థను కాంగ్రెస్ హయాంలో వాటి భవితవ్యానికి వదిలేసిందని ప్రధాని మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్ము లోయలో మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనంతరం గ్రౌండ్ లెవెల్లో ప్రజాస్వామ్యం స్థాపించబడిందని ప్రధాని తెలిపారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత, మొదటిసారిగా గ్రామ పంచాయతీ నుండి జిల్లా స్థాయికి ఎన్నికలు జరిగాయన్నారు. వాటి ద్వారా 33 వేల మందికి పైగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని మోడీ బీజేపీ నేతలకు గుర్తు చేశారు. లోయలో తొలిసారిగా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం ఏర్పడిందని మోడీ తెలిపారు. గ్రామాల్లో కొంత సమయం గడపడం ద్వారా చిన్న ప్రాంతాలతో తమను తాము పరిచయం చేసుకోవాలని ప్రధాని మోడీ బిజెపి కార్యకర్తలను కోరారు. గత 25 ఏళ్ల అనుభవాన్ని కార్యకర్తలను గుర్తు చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రతినిధిగా, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రయోజనాలను సమాజంలోని చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారానికి 2 రాత్రులు మీ ప్రాంతంలోని ఏదైనా గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతో కూర్చోవాలని ప్రధాని మోడీ కార్యకర్తలకు సూచించారు.
తాజావార్తలు
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!