PM Modi: గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశంలోని గ్రామాల్లో గ్రామపంచాయతీరాజ్ వ్యవస్థను తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హర్యానాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రాంతీయ పంచాయతీరాజ్ కౌన్సిల్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఫరీదాబాద్లోని సూరజ్కుండ్లో జరిగిన కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధన్ఖడ్ తదితరులతో కలిసి మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనం చేసిందని ప్రధాని విమర్శించారు.
Read also: Kushi : ట్రైలర్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం ఎంత అవసరమో కాంగ్రెస్కు అర్థం కాలేదన్నారు. ఆ తర్వాత ఏర్పాటైన జిల్లా పంచాయతీ వ్యవస్థను కాంగ్రెస్ హయాంలో వాటి భవితవ్యానికి వదిలేసిందని ప్రధాని మోదీ అన్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్ము లోయలో మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనంతరం గ్రౌండ్ లెవెల్లో ప్రజాస్వామ్యం స్థాపించబడిందని ప్రధాని తెలిపారు. ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత, మొదటిసారిగా గ్రామ పంచాయతీ నుండి జిల్లా స్థాయికి ఎన్నికలు జరిగాయన్నారు. వాటి ద్వారా 33 వేల మందికి పైగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని మోడీ బీజేపీ నేతలకు గుర్తు చేశారు. లోయలో తొలిసారిగా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం ఏర్పడిందని మోడీ తెలిపారు. గ్రామాల్లో కొంత సమయం గడపడం ద్వారా చిన్న ప్రాంతాలతో తమను తాము పరిచయం చేసుకోవాలని ప్రధాని మోడీ బిజెపి కార్యకర్తలను కోరారు. గత 25 ఏళ్ల అనుభవాన్ని కార్యకర్తలను గుర్తు చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రతినిధిగా, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రయోజనాలను సమాజంలోని చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి వరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వారానికి 2 రాత్రులు మీ ప్రాంతంలోని ఏదైనా గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతో కూర్చోవాలని ప్రధాని మోడీ కార్యకర్తలకు సూచించారు.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!