PM Modi: రతన్ టాటా బతికి ఉంటే.. ఇది చూసి ఆనందించేవారు..
- గుజరాత్లో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ని ప్రారంభించిన మోడీ..
- రతన్ టాటా బతికి ఉంటే ఇది చూసి ఆనందించేవారు..
- సీ-295 విమానాల తయారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గుజరాత్ వడోదలో ప్రతిష్టాత్మక C-295 ఎయిర్క్రాఫ్ట్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిపి ప్రారంభించారు. టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్లో ఈ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ‘‘ కొన్ని రోజుల క్రితం మేము భారతదేశ ముద్దుబిడ్డ రతన్ టాటాను కోల్పోయాము, ఈ రోజు అతను జీవించి ఉంటే ఈ ప్రాజెక్టును చూసి చాలా సంతోషించేవారు’’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రతన్ టాటా ఎక్కడ ఉన్నా, ఈ ప్రాజెక్టుని చూసి ఆనందిస్తున్నారని చెప్పారు. C295 విమానాల కర్మాగారం న్యూ ఇండియా యొక్క కొత్త పని సంస్కృతికి చిహ్నమని అన్నారు.
Read Also: Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఈ ప్రాజెక్టు భారతదేశం-స్పెయిన్ సంబంధాలకు కొత్త దిశను ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారత్-స్పెయిన్ సంబంధాలకు మరిత పటిష్టం చేస్తుందని చెప్పారు. ‘‘మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’’ మిషన్ని ఈ ప్రాజెక్టు శక్తివంతం చేస్తుందని చెప్పారు. నేడు దేశ డిఫెన్ తయారీ ఎకోసిస్టమ్ మరింత ఉన్నతంగా మారిందని చెప్పారు. గత దశాబ్దకాలంగా దేశంలో ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకుందని, భారతదేశంలో శక్తివంతమైన రక్షణ పరిశ్రమ అభివృద్ధికి దారి తీసిందని అన్నారు.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) ఫెసిలిటీలో భారతదేశానికి సైనిక విమాల కోసం మొదటి ప్రైవేట్ సెక్టార్ ఫైనల్ అసెంబ్లీ లైన్ అయిన TAS ద్వారా C-295 విమానాలను తయారీ చేయనున్నారు. ఈ ఫెసిటిలీలో 40 విమానాలను నిర్మించనుండగా.. ఏవియేషన్ బెహెమోత్ ఎయిర్ బేస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. భారత్లో 40 విమానాల తయారీకి TASL బాధ్యత వహిస్తుంది. టాటాలతో పాటు, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అలాగే ప్రైవేట్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరిస్తాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!