Danish Kaneria: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఆగ్రహం సొంత దేశంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది హిందూ ఆటగాళ్లలో కనేరియా ఒకరు. మంగళవారం జరిగిన ఉగ్ర ఘటనపై ఆయన మరోసారి స్పందించారు.
28 మందిని బలిగొన్న ఉగ్ర ఘటనపై పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రత్యక్షంగా ఎత్తి చూపారు. ఎక్స్ వేదికగా ‘‘ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదు?’’ అని ప్రశ్నించారు. ‘‘పాక్ ఆర్మీ ఆకస్మత్తుగా ఎందుకు అప్రమత్తమైంది..? ఎందుకంటే మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచుతున్నారు. ఇది మీకు సిగ్గు చేటు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి ముందు మంగళవారం ఉగ్రవాద దాడిపై ఆయన స్పందించారు. ‘‘‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ, అతడి మృతదేహం పక్కన దీనంగా కూర్చుని ఉన్న ఫోటోని జత చేశారు.
If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.
— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025