Excise Department decision: మందేసి పట్టుబడితే అక్కడ రాచ మర్యాదలే.. ఆలస్యం ఎందుకు
Excise Department decision: మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మద్య నిషేధం అమలవుతున్న బీహార్లో మద్యం సేవించి పట్టుబడిన వారికి రాజ మర్యాదలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి పట్టుబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ప్రముఖుల కోసం వీటిని నిర్మించినట్లు బీహార్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం సేవించి పట్టుబడిన వీఐపీల కోసం పడకలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, బల్లలు, ఏసీ సౌకర్యాలు కల్పించారు. ఈ కేంద్రంలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. సమస్తిపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కె చౌదరి మాట్లాడుతూ శిక్షణ పొందిన కుక్కను కూడా ప్రతి కేంద్రంలో రక్షణ కోసం ఉంచుతున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వీఐపీలను 24 గంటలు మాత్రమే ఈ కేంద్రాల్లో ఉండేందుకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

బీహార్లో ఏప్రిల్ 2016 నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. మద్యం తాగి పట్టుబడిన వారి నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. 2 వేల నుంచి 5 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు 20 వేల మందిని అరెస్టు చేశారు. చాలా మంది డ్రగ్స్ బానిసలు నెలల తరబడి జైలు జీవితం గడిపారు. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవలే బీజేపీకి వీడ్కోలు పలికి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar: The Excise Department has arranged a VIP ward for VIPs caught intoxicated publically in the state. VIP cells have been constructed in Samastipur Excise Department to keep VIP persons for 24 hours. pic.twitter.com/v85fEDAP62
— ANI (@ANI) October 9, 2022
తాజావార్తలు
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
-
Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!