Excise Department decision: మందేసి పట్టుబడితే అక్కడ రాచ మర్యాదలే.. ఆలస్యం ఎందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Department decision: మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మద్య నిషేధం అమలవుతున్న బీహార్లో మద్యం సేవించి పట్టుబడిన వారికి రాజ మర్యాదలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి పట్టుబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ప్రముఖుల కోసం వీటిని నిర్మించినట్లు బీహార్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం సేవించి పట్టుబడిన వీఐపీల కోసం పడకలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, బల్లలు, ఏసీ సౌకర్యాలు కల్పించారు. ఈ కేంద్రంలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. సమస్తిపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కె చౌదరి మాట్లాడుతూ శిక్షణ పొందిన కుక్కను కూడా ప్రతి కేంద్రంలో రక్షణ కోసం ఉంచుతున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వీఐపీలను 24 గంటలు మాత్రమే ఈ కేంద్రాల్లో ఉండేందుకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
- PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..

బీహార్లో ఏప్రిల్ 2016 నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. మద్యం తాగి పట్టుబడిన వారి నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. 2 వేల నుంచి 5 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు 20 వేల మందిని అరెస్టు చేశారు. చాలా మంది డ్రగ్స్ బానిసలు నెలల తరబడి జైలు జీవితం గడిపారు. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవలే బీజేపీకి వీడ్కోలు పలికి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar: The Excise Department has arranged a VIP ward for VIPs caught intoxicated publically in the state. VIP cells have been constructed in Samastipur Excise Department to keep VIP persons for 24 hours. pic.twitter.com/v85fEDAP62
— ANI (@ANI) October 9, 2022
తాజావార్తలు
-
PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
-
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.1 కోటి విరాళం
-
KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
-
Commonwealth Games 2026: భారత్కు డబుల్ మెడల్.. నీరజ్ చోప్రాకు రజతం, యశ్వీర్ సింగ్కు కాంస్యం
-
Aaron Finch: వరల్డ్ క్రికెట్లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!