Excise Department decision: మందేసి పట్టుబడితే అక్కడ రాచ మర్యాదలే.. ఆలస్యం ఎందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Department decision: మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మద్య నిషేధం అమలవుతున్న బీహార్లో మద్యం సేవించి పట్టుబడిన వారికి రాజ మర్యాదలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి పట్టుబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ప్రముఖుల కోసం వీటిని నిర్మించినట్లు బీహార్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం సేవించి పట్టుబడిన వీఐపీల కోసం పడకలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, బల్లలు, ఏసీ సౌకర్యాలు కల్పించారు. ఈ కేంద్రంలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. సమస్తిపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కె చౌదరి మాట్లాడుతూ శిక్షణ పొందిన కుక్కను కూడా ప్రతి కేంద్రంలో రక్షణ కోసం ఉంచుతున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వీఐపీలను 24 గంటలు మాత్రమే ఈ కేంద్రాల్లో ఉండేందుకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
- Kerala: ‘అతనంటే నాకు ఇష్టం లేదు’.. సీఎం సతీశన్ను చంపేస్తానంటూ బెదిరింపు.. అరెస్ట్
- Jaishankar: రష్యా చమురుపై భారత్కు ఫిన్లాండ్ మద్దతు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

బీహార్లో ఏప్రిల్ 2016 నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. మద్యం తాగి పట్టుబడిన వారి నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. 2 వేల నుంచి 5 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు 20 వేల మందిని అరెస్టు చేశారు. చాలా మంది డ్రగ్స్ బానిసలు నెలల తరబడి జైలు జీవితం గడిపారు. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవలే బీజేపీకి వీడ్కోలు పలికి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar: The Excise Department has arranged a VIP ward for VIPs caught intoxicated publically in the state. VIP cells have been constructed in Samastipur Excise Department to keep VIP persons for 24 hours. pic.twitter.com/v85fEDAP62
— ANI (@ANI) October 9, 2022
తాజావార్తలు
-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్కు రిక్త హస్తమే..
-
Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
-
RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
-
Tollywood New Trend: మమ్మల్ని మేమే చెక్కుకుంటాం!
-
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!