Excise Department decision: మందేసి పట్టుబడితే అక్కడ రాచ మర్యాదలే.. ఆలస్యం ఎందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Excise Department decision: మద్య నిషేధం అమలవుతున్న బిహార్ VIP మందుబాబుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను నిర్మిస్తోంది. మద్యం తాగి పట్టుబడే ప్రజాప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులను 24 గంటలపాటు అందులో ఉంచనుంది.అత్యాధునిక సౌకర్యాలన్నీ ఆ కేంద్రాల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మద్య నిషేధం అమలవుతున్న బీహార్లో మద్యం సేవించి పట్టుబడిన వారికి రాజ మర్యాదలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. మద్యం సేవించి పట్టుబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ప్రముఖుల కోసం వీటిని నిర్మించినట్లు బీహార్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం సేవించి పట్టుబడిన వీఐపీల కోసం పడకలు, పరుపులు, సోఫాలు, కుర్చీలు, బల్లలు, ఏసీ సౌకర్యాలు కల్పించారు. ఈ కేంద్రంలో అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించారు. సమస్తిపూర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కె చౌదరి మాట్లాడుతూ శిక్షణ పొందిన కుక్కను కూడా ప్రతి కేంద్రంలో రక్షణ కోసం ఉంచుతున్నట్లు తెలిపారు. మద్యం తాగి పట్టుబడిన వీఐపీలను 24 గంటలు మాత్రమే ఈ కేంద్రాల్లో ఉండేందుకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read

బీహార్లో ఏప్రిల్ 2016 నుంచి మద్య నిషేధం అమలులో ఉంది. మద్యం తాగి పట్టుబడిన వారి నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. 2 వేల నుంచి 5 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు 20 వేల మందిని అరెస్టు చేశారు. చాలా మంది డ్రగ్స్ బానిసలు నెలల తరబడి జైలు జీవితం గడిపారు. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు నేరస్థుడిని పోలీసులు పట్టుకున్నప్పుడు, నిందితుడు మద్యం ఎక్కడి నుండి పొందారో ఆ వ్యక్తి పేరును వెల్లడించాలనే నిబంధన కూడా ఉంది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవలే బీజేపీకి వీడ్కోలు పలికి ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
#WATCH | Bihar: The Excise Department has arranged a VIP ward for VIPs caught intoxicated publically in the state. VIP cells have been constructed in Samastipur Excise Department to keep VIP persons for 24 hours. pic.twitter.com/v85fEDAP62
— ANI (@ANI) October 9, 2022
తాజావార్తలు
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!