Sukesh Chandrasekhar: నేను పెద్ద దొంగను అయితే కేజ్రీవాల్ “మహా దొంగ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If I am biggest thug, then Kejriwal is ‘maha thug’, says conman Sukesh: మనీలాండరింగ్, దోపిడి కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలతో లింకులు, అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు సుకేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలే జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. జైలులో ఉనన తనకు రక్షణ కోసం రూ. 10 కోట్లను ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు చెల్లించాలని చెబుతూ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే మరోసారి ఎల్జీకి ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశాడు సుకేష్ చంద్రశేఖర్. ఎల్జీకి ఫిర్యాదు చేసినందుకు ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్, తీహార్ జైలు మాజీ డీజీ బెదిరిస్తున్నారని లేఖ రాశారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
Also Read
- NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు 2015 నుంచి తెలుసని లేఖలో పేర్కొన్నాడు సుకేష్, దక్షిణ భారతదేశంలో పార్టీకి సంబంధించి ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చినందుకు రూ. 50 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నాడు. దేశంలోనే నన్ను పెద్ద దొంగగా పేర్కొంటున్న కేజ్రీవాల్.. నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు తీసుకుని, రాజ్యసభ పదవిని ఆఫర్ చేసిన మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ‘‘ మహా దొంగ’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను బిగ్గెస్ట్ థగ్ అయితే మీరు మహథగ్ ’’ అని లేఖలో పేర్కొన్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్ల విరాళం ఇచ్చేలా 20-30 మందిని తీసుకురావాలని నన్ను బలవంతం చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇదిలా ఉంటే గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనను పక్కదారి పట్టించేందుకే సుకేష్ ఆరోపణలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రముఖుల నుంచి డబ్బును వసూలు చేశాడన్న ఆరోపణలో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్. గతంలో తీహార్ జైలులో ఉన్నప్పుడు.. తనకు ప్రాణహాని ఉందని పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మండోలి జైలుకు మార్చారు అధికారులు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఈ ఏడాడి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.
Conman Sukesh Chandrashekhar in a letter to his lawyer alleges, "Delhi Minister Satyendar Jain & ex-Tihar DG are threatening me after my complaint to Delhi's LG went public".
— ANI (@ANI) November 5, 2022
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..