Sukesh Chandrasekhar: నేను పెద్ద దొంగను అయితే కేజ్రీవాల్ “మహా దొంగ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
If I am biggest thug, then Kejriwal is ‘maha thug’, says conman Sukesh: మనీలాండరింగ్, దోపిడి కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలతో లింకులు, అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు సుకేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలే జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. జైలులో ఉనన తనకు రక్షణ కోసం రూ. 10 కోట్లను ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు చెల్లించాలని చెబుతూ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే మరోసారి ఎల్జీకి ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశాడు సుకేష్ చంద్రశేఖర్. ఎల్జీకి ఫిర్యాదు చేసినందుకు ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్, తీహార్ జైలు మాజీ డీజీ బెదిరిస్తున్నారని లేఖ రాశారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు 2015 నుంచి తెలుసని లేఖలో పేర్కొన్నాడు సుకేష్, దక్షిణ భారతదేశంలో పార్టీకి సంబంధించి ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చినందుకు రూ. 50 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నాడు. దేశంలోనే నన్ను పెద్ద దొంగగా పేర్కొంటున్న కేజ్రీవాల్.. నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు తీసుకుని, రాజ్యసభ పదవిని ఆఫర్ చేసిన మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ‘‘ మహా దొంగ’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను బిగ్గెస్ట్ థగ్ అయితే మీరు మహథగ్ ’’ అని లేఖలో పేర్కొన్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్ల విరాళం ఇచ్చేలా 20-30 మందిని తీసుకురావాలని నన్ను బలవంతం చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇదిలా ఉంటే గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనను పక్కదారి పట్టించేందుకే సుకేష్ ఆరోపణలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రముఖుల నుంచి డబ్బును వసూలు చేశాడన్న ఆరోపణలో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్. గతంలో తీహార్ జైలులో ఉన్నప్పుడు.. తనకు ప్రాణహాని ఉందని పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మండోలి జైలుకు మార్చారు అధికారులు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఈ ఏడాడి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.
Conman Sukesh Chandrashekhar in a letter to his lawyer alleges, "Delhi Minister Satyendar Jain & ex-Tihar DG are threatening me after my complaint to Delhi's LG went public".
— ANI (@ANI) November 5, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!