Sukesh Chandrasekhar: నేను పెద్ద దొంగను అయితే కేజ్రీవాల్ “మహా దొంగ”..
If I am biggest thug, then Kejriwal is ‘maha thug’, says conman Sukesh: మనీలాండరింగ్, దోపిడి కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ భామలతో లింకులు, అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు సుకేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం ఢిల్లీలోని మండోలే జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు. జైలులో ఉనన తనకు రక్షణ కోసం రూ. 10 కోట్లను ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు చెల్లించాలని చెబుతూ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే మరోసారి ఎల్జీకి ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశాడు సుకేష్ చంద్రశేఖర్. ఎల్జీకి ఫిర్యాదు చేసినందుకు ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్, తీహార్ జైలు మాజీ డీజీ బెదిరిస్తున్నారని లేఖ రాశారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు 2015 నుంచి తెలుసని లేఖలో పేర్కొన్నాడు సుకేష్, దక్షిణ భారతదేశంలో పార్టీకి సంబంధించి ముఖ్యమైన పదవి ఇస్తానని హామీ ఇచ్చినందుకు రూ. 50 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నాడు. దేశంలోనే నన్ను పెద్ద దొంగగా పేర్కొంటున్న కేజ్రీవాల్.. నా దగ్గర నుంచి రూ. 50 కోట్లు తీసుకుని, రాజ్యసభ పదవిని ఆఫర్ చేసిన మిమ్మల్ని ఏమనాలని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ‘‘ మహా దొంగ’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను బిగ్గెస్ట్ థగ్ అయితే మీరు మహథగ్ ’’ అని లేఖలో పేర్కొన్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 500 కోట్ల విరాళం ఇచ్చేలా 20-30 మందిని తీసుకురావాలని నన్ను బలవంతం చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్ చంద్రశేఖర్. ఇదిలా ఉంటే గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలిన ఘటనను పక్కదారి పట్టించేందుకే సుకేష్ ఆరోపణలు చేస్తున్నట్లు కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రముఖుల నుంచి డబ్బును వసూలు చేశాడన్న ఆరోపణలో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్. గతంలో తీహార్ జైలులో ఉన్నప్పుడు.. తనకు ప్రాణహాని ఉందని పదేపదే ఆరోపించిన నేపథ్యంలో మండోలి జైలుకు మార్చారు అధికారులు. మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కూడా ఈ ఏడాడి మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది.
Conman Sukesh Chandrashekhar in a letter to his lawyer alleges, "Delhi Minister Satyendar Jain & ex-Tihar DG are threatening me after my complaint to Delhi's LG went public".
— ANI (@ANI) November 5, 2022
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!