Asaduddin Owaisi: రాకేష్ కాకుండా, చీఫ్ జస్టిస్పై ‘‘అసద్’’ దాడికి పాల్పడుంటే..?
- సీజేఐపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘‘అసద్’’ అయి ఉంటే..
- ఢిల్లీ పోలీసులు ఇలానే వ్యవహరించేవారా..?
- సీజేఐ-షూ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్, ఓ కేసులో శ్రీ మహా విష్ణువు గురించి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలనే పిటిషన్పై..‘‘ మీరు విష్ణువు భక్తులు కదా, విష్ణువునే ఏమైనా చేయమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం రాకేష్ అనే 70 ఏళ్లకు పైబడిన న్యాయవాది కోర్టు హాలులో సీజేఐ బీఆర్ గవాయ్పై షూతో దాడికి పాల్పడ్డాడు. అయితే, సీజేఐ ఆదేశాల మేరకు, ఢిల్లీ పోలీసులు అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Read Also: Illicit affair: అత్తతో అక్రమ సంబంధం.. భార్య హత్య..
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
అయితే, ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ కేసులో రాకేష్ కాకుండా, షూ విసిరిన వ్యక్తి పేరు ‘‘అసద్’’ అయి ఉంటే పోలీసులు ఇలాగే స్వేచ్ఛగా వెళ్లనిచ్చేవారా..? అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు… ఎందుకంటే అతని పేరు రాకేష్ కిషోర్’’ అని ఓవైసీ అన్నారు. ‘‘అతని పేరు రాకేష్ కాదు, ‘అసద్’ అయితే, ఢిల్లీ పోలీసులు ఏమి చేసేవారు?’’ అని అడిగారు.
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి కులం ప్రకారం దళితుడు. నేను నా దళిత సోదరుల్ని అడగాలని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి కోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరాడు. ఏం జరుగుతోంది..?. నేరస్తుడు భారతదేశం సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించదు. కానీ ప్రధాన న్యాయమూర్తి పై షూ విసిరేసే ధైర్యాన్ని అతడికి ఎలా వచ్చింది.?’’ అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, యూఏపీఏ చట్టాలను ఎందుకు ప్రయోగించలేదు..? నిందితుడు ఒక వేళ అసద్ అయితే, అతడిని పాకిస్తాన్ తో ముడిపెట్టే వారు అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!