Tamilisai: ‘‘బీఫ్ తినడం సరైనది అయితే, గోమూత్రం ఎందుకు కాదు’’.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు..
- తమిళనాడులో సంచలనంగా ఐఐటీ డైరెక్టర్ ‘గోమూత్ర’ వ్యాఖ్యలు..
- ‘‘బీఫ్ తినడం సరైనది అయితే, గోమూత్రం ఎందుకు కాదు’’..
- బీజేపీ నేత తమిళిసై సంచలన వ్యాఖ్యలు..
Tamilisai: తమిళనాడు బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. మరో వర్గం తమ వ్యాధులను నయం చేయడానికి గోమూత్రం ఉపయోగిస్తారు. దీనిపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు..? ’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘తన తండ్రి జ్వరానికి గోమూత్రంతో చికిత్స చేస్తున్నానని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి వ్యాఖ్యానించారు’’. ఆయన వ్యాఖ్యలకు తమిళిసై మద్దతుగా నిలిచారు.
Read Also: HYDRA PS: బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
కామకోటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..ఒక సన్యాని తన తండ్రి తీవ్ర జ్వరానికి గోమూత్రాన్ని మందుగా ఉపయోగించాని అన్నారు. గోమూత్రం తాగిన 15 నిమిషాల్లోనే జ్వరం తగ్గిందని చెప్పారు. గోమూత్రంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని మరియు కడుపు చికాకు కలిగించే వ్యాధి చికిత్సకు సహాయపడుతుందని ఆయన అన్నారు. దీనిపై కొందరు విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఇలా సూడోసైన్స్ని ప్రచారం చేయడం అభ్యంతరకరం అని అన్నారు. డీఎంకే నేత ఎలంగోవన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వ్యాధుల్ని తగ్గించడానికి గోమూత్రం తాగమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఐఐటీకి బదులుగా కామకోటిని ఎయిమ్స్కి బదిలీ చేయాలని ఎలంగోవన్ అన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కామకోటికి మద్దతు తెలిపారు. డీఎంకే, ఇతర పార్టీలు దీనిని రాజకీయం చేయాలని చూస్తు్న్నాయని ఆరోపించారు. ప్రొఫెసర్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవిగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా! ఒకేసారి మూడు క్రేజీ ప్రాజెక్టులు?
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!