Tamilisai: తమిళనాడు బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. మరో వర్గం తమ వ్యాధులను నయం చేయడానికి గోమూత్రం ఉపయోగిస్తారు. దీనిపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు..? ’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘తన తండ్రి జ్వరానికి గోమూత్రంతో చికిత్స చేస్తున్నానని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి వ్యాఖ్యానించారు’’. ఆయన వ్యాఖ్యలకు తమిళిసై మద్దతుగా నిలిచారు.