IAS Prasad: నిత్య పెళ్లికొడుకులా మారిన ఐఏఎస్ అధికారి.. ఇప్పటికే ఇద్దరు కలెక్టర్లతో పెళ్లి.. తాజాగా మూడో ట్విస్ట్ ఏంటంటే..!
- నిత్య పెళ్లికొడుకులా మారిన ఐఏఎస్ అధికారి
- ఇప్పటికే ఇద్దరు కలెక్టర్లతో పెళ్లి
- తాజాగా మరో బ్యూరోక్రాట్తో వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో అమ్మాయిలు దొరక్కా ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు. వయసు పైబడుతున్నా.. వెంట్రుకలు మెరిసిపోతున్నా పెళ్లి కాని ప్రసాద్లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం. ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Also Read
- Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
- Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి ఎంపికయ్యాడు. ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్
అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్లో చేరింది. ప్రస్తుతం రత్లాం కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో.. తెలియదు గానీ నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు. ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్లో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంత మంది వ్యక్తిగతం అనగా.. ఇంకొందరు తప్పుపట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు.
ఇదిలా ఉంటే మూడవ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పనిచేస్తున్నారు. గతంలో అనేక జిల్లాల్లో కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
-
Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
-
Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు
-
Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!