Modi Clarification: అందుకే వారిని రావొద్దని చెప్పాను.. స్పష్టత ఇచ్చిన ప్రధాని మోడీ
Modi Clarification: చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్ర్తవేత్తలను అభినందించడానికి ప్రధాన నరేంధ్ర మోడీ ఈ రోజు బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, గవర్నర్ గానీ ఎవరూ హాజరు కాలేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. కావాలనే బీజేపీ వారు ఇలా వ్యవహారించారని మండిపడింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టే ప్రధాని వారిని ఎయిర్పోర్టుకు ఆహ్వానించలేదని విమర్శించారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు.
Read Also: Sakshi: అయ్యో… ఇద్దరూ ముంచేశారు!
Also Read
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
శనివారం ఉదయం బెంగళూరుకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు.. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరిలో ఎవరూ హాజరుకాలేదు. మోదీ ఉద్దేశపూర్వకంగానే వారిని ఎయిర్పోర్టుకు రావొద్దన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘తనకంటే ముందు కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంపై మోదీ చాలా చికాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్కు విరుద్ధంగా.. వారిద్దరిని ఉద్దేశపూర్వకంగా ఎయిర్పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. చంద్రయాన్-1 విజయం వేళ.. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్కు వెళ్లారు. ఆ విషయాన్ని మోదీ మర్చిపోయారా..?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు.
ఈ వ్యవహారంపై బెంగళూరులోని హాల్ ఎయిర్పోర్టు వెలుపల ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘బెంగళూరు(Bengaluru)కు నేను ఏ సమయంలో చేరుకుంటానో ఖచ్చితంగా తెలియదు… అందుకే ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని.. అందుకే వారిని రావొద్దని చెప్పాను’ అని మోడీ వెల్లడించారు. శుక్రవారం గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని మోడీ … ఈ ఉదయం నేరుగా బెంగళూరు వచ్చి, శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వారి కృషికి సెల్యూట్ చేశారు.
Read Also: Indian Cinema: 2500 కోట్లు… ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్… కలెక్షన్ల సునామీ రాబోతుంది
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అంశంపై స్పందించారు. ‘ప్రధాని మోడీ చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రొటోకాల్ ప్రకారం సీఎం, నేను ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్దామని అనుకున్నాం. కానీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని మేం గౌరవించాలనుకున్నాం. పొలిటికల్ గేమ్ ఇప్పటికే ముగిసింది. ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాం’ అని శివకుమార్ అన్నారు.
- Tags
- Clarification
- CM
- congress
- modi
- pmo
తాజావార్తలు
-
Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
-
Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
-
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
-
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!