Chhattisgarh : మధ్యపానం నిషేధించే ధైర్యం నాకు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : రాష్ట్రంలో మధ్యపానం నిషేధించే ధైర్యం తనకుకు లేదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. మధ్యపానాన్ని నిషేధించాలని భావించినప్పటికీ లాక్డౌన్-19లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించడానికి తాను భయపడుతున్నానని స్పష్టం చేశారు. లాక్డౌన్ రోజుల్లో ప్రజలు నకిలీ మద్యం మరియు శానిటైజర్లను కూడా ఆశ్రయించారని అది వారి ప్రాణాలను బలిగొందని బగెల్ అన్నారు. అందుకే తాను మద్యపానాన్ని నిషేధించలేకపోతున్నానని అన్నారు.
Read alsoఛ Traffic restrictions: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
దుర్గ్లో జరిగిన ఓ సదస్సులో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొని మాట్లాడుతూ తన కంటే ముందున్న సీఎం రమణ్ సింగ్ అమలు చేసిన వ్యవస్థలే ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నాయని బఘేల్ అన్నారు. లాక్డౌన్ రోజులను గుర్తుచేసుకుంటూ, కోవిడ్ -19 మహమ్మారి కంటే ముందు మద్యాన్ని నిషేధించాలని అనుకున్నానని కానీ కోవిడ్ -19 మహమ్మారి సంభవించిందని.. అపుడు కొనసాగిన లాక్డౌన్ సమయంలో, ప్రజలు నకిలీ మరియు విషపూరిత మద్యం సేవించడం ప్రారంభించారని గుర్తు చేశారు. శానిటైజర్లను కూడా ఆశ్రయించి ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే మద్యపానాన్ని నిషేధించే ధైర్యం నాకు లేదన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తే నకిలీ మరియు విషపూరితమైన మద్యం సేవించి ప్రజలు చనిపోతారనే భయంతోనే ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు.
Read alsoఛ Ponguleti: ఖమ్మం నడి బోడ్డునే పార్టీలో జాయిన్ అవుతా.. క్లారిటీ ఇచ్చిన పొంగులేటి
ఎన్నికల్లో గెలవగలిగిన వారికి టిక్కెట్లు ఇస్తారని… తమ ఎమ్మెల్యేలలో చాలా మందికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని.. కొంతమంది వ్యక్తులు తమ తోటి పార్టీ సభ్యులతో వ్యక్తిగత లేదా ఆరోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల మనోవేదనలను కలిగి ఉండవచ్చన్నారు. వారి పరిస్థితి ఎఎన్నికల లోపల మెరుగుపడితే మెరుగుపడితే వారి టిక్కెట్లు ఇస్తారని తెలిపారు. ఎంఎస్పి (కనీస మద్దతు ధర) అంశంపై చర్చించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ నేరుగా కాంగ్రెస్కు సవాల్ విసిరారని, ఏదైనా అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంఎస్పీ శాతం ఎంత పెరిగిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎంఎస్పి రూ. 1,800 ఉన్నప్పుడు, మేము దానిని రూ. 2,500 వద్ద కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి రైతుల ప్రయోజనం కోసం స్వామినాథన్ కమిటీ నివేదిక ఆధారంగా మేము దానిని కొద్దిగా పెంచామఅని బఘేల్ చెప్పారు. ఛత్తీస్గఢ్లో జరగనున్న ఎన్నికల గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుమారి సెల్జాతో తాను సమావేశమయ్యానని బఘేల్ చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలతో కూడా మరిన్ని సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. థర్డ్ఫ్రంట్ గురించి బఘేల్ మాట్లాడుతూ.. అజిత్ జోగి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము అధికారంలో లేము, కానీ ఆయన కాంగ్రెస్ను వీడిన వెంటనే మేము అధికారంలోకి వచ్చాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకోగా, మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పుడూ 60కి చేరుకోలేదు. ఉపఎన్నికల్లో మేం ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకున్నాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!