Chhattisgarh : మధ్యపానం నిషేధించే ధైర్యం నాకు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : రాష్ట్రంలో మధ్యపానం నిషేధించే ధైర్యం తనకుకు లేదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. మధ్యపానాన్ని నిషేధించాలని భావించినప్పటికీ లాక్డౌన్-19లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించడానికి తాను భయపడుతున్నానని స్పష్టం చేశారు. లాక్డౌన్ రోజుల్లో ప్రజలు నకిలీ మద్యం మరియు శానిటైజర్లను కూడా ఆశ్రయించారని అది వారి ప్రాణాలను బలిగొందని బగెల్ అన్నారు. అందుకే తాను మద్యపానాన్ని నిషేధించలేకపోతున్నానని అన్నారు.
Read alsoఛ Traffic restrictions: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
దుర్గ్లో జరిగిన ఓ సదస్సులో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొని మాట్లాడుతూ తన కంటే ముందున్న సీఎం రమణ్ సింగ్ అమలు చేసిన వ్యవస్థలే ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నాయని బఘేల్ అన్నారు. లాక్డౌన్ రోజులను గుర్తుచేసుకుంటూ, కోవిడ్ -19 మహమ్మారి కంటే ముందు మద్యాన్ని నిషేధించాలని అనుకున్నానని కానీ కోవిడ్ -19 మహమ్మారి సంభవించిందని.. అపుడు కొనసాగిన లాక్డౌన్ సమయంలో, ప్రజలు నకిలీ మరియు విషపూరిత మద్యం సేవించడం ప్రారంభించారని గుర్తు చేశారు. శానిటైజర్లను కూడా ఆశ్రయించి ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే మద్యపానాన్ని నిషేధించే ధైర్యం నాకు లేదన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తే నకిలీ మరియు విషపూరితమైన మద్యం సేవించి ప్రజలు చనిపోతారనే భయంతోనే ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు.
Read alsoఛ Ponguleti: ఖమ్మం నడి బోడ్డునే పార్టీలో జాయిన్ అవుతా.. క్లారిటీ ఇచ్చిన పొంగులేటి
ఎన్నికల్లో గెలవగలిగిన వారికి టిక్కెట్లు ఇస్తారని… తమ ఎమ్మెల్యేలలో చాలా మందికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని.. కొంతమంది వ్యక్తులు తమ తోటి పార్టీ సభ్యులతో వ్యక్తిగత లేదా ఆరోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల మనోవేదనలను కలిగి ఉండవచ్చన్నారు. వారి పరిస్థితి ఎఎన్నికల లోపల మెరుగుపడితే మెరుగుపడితే వారి టిక్కెట్లు ఇస్తారని తెలిపారు. ఎంఎస్పి (కనీస మద్దతు ధర) అంశంపై చర్చించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ నేరుగా కాంగ్రెస్కు సవాల్ విసిరారని, ఏదైనా అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంఎస్పీ శాతం ఎంత పెరిగిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎంఎస్పి రూ. 1,800 ఉన్నప్పుడు, మేము దానిని రూ. 2,500 వద్ద కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి రైతుల ప్రయోజనం కోసం స్వామినాథన్ కమిటీ నివేదిక ఆధారంగా మేము దానిని కొద్దిగా పెంచామఅని బఘేల్ చెప్పారు. ఛత్తీస్గఢ్లో జరగనున్న ఎన్నికల గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుమారి సెల్జాతో తాను సమావేశమయ్యానని బఘేల్ చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలతో కూడా మరిన్ని సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. థర్డ్ఫ్రంట్ గురించి బఘేల్ మాట్లాడుతూ.. అజిత్ జోగి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము అధికారంలో లేము, కానీ ఆయన కాంగ్రెస్ను వీడిన వెంటనే మేము అధికారంలోకి వచ్చాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకోగా, మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పుడూ 60కి చేరుకోలేదు. ఉపఎన్నికల్లో మేం ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకున్నాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!