Karnataka: కేంద్రం అనుమతిస్తే పాక్పై ఆత్మాహుతి దాడి చేస్తా.. మంత్రి అహ్మద్ఖాన్ వ్యాఖ్య
- కేంద్రం అనుమతిస్తే పాక్పై ఆత్మాహుతి దాడి చేస్తా
- కర్ణాటక మంత్రి అహ్మద్ఖాన్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల మధ్య కర్ణాటక మంత్రి బీజడ్ జమీర్ అహ్మద్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అనుమతిస్తే.. పాక్లో ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్కు శత్రువేనన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘పాకిస్థాన్ ఎల్లప్పుడూ భారత్కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.’’ అని ఆయన అన్నారు.
Also Read
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
ఇది కూడా చదవండి: Kamala Harris: డ్యాన్స్తో అదరగొట్టిన కమలా హారిస్.. వీడియో వైరల్
ఇక పాక్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ దాడులకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ మంత్రి మజీంద్ సింగ్ సిర్సా తీవ్రంగా మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్పై ఆధారాలు కావాలంటే పాకిస్థాన్కు వెళ్లి చెక్ చేసుకోవచ్చని ఘాటుగా బదులిచ్చారు. దీంతో చరణ్జీత్ వెనక్కి తగ్గారు. తాను ఆధారాలు అడగలేదని తెలిపారు. పాక్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా.. కాంగ్రెస్ దానికి మద్దతునిస్తుందని వెల్లడించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అప్పటి నుంచి భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలు రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసేసింది.
ఇది కూడా చదవండి: Indonesia: మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!