Supreme Court: ‘నేను బతికే ఉన్నా యువర్ హానర్’.. తన హత్య కేసు విచారణలో ప్రత్యక్షమైన బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తన హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ పిల్లాడు కోర్టు ముందుకు రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులతో పాటు అంతా షాక్ అయ్యారు. తన హత్య బూటకమని 11 ఏళ్ల బాలుడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యాడు. బాలుడి తండ్రి, తన భార్య తరుపు కుటుంబం తన కొడుకును చంపాడని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ప్రదేశ్లోని పిలిభిత్కి చెందిన 11 ఏళ్ల అభయ్ సింగ్ అనే బాలుడిని, అతని తల్లి తరుపు బంధువులు హత్య చేశారని తండ్రి కేసు పెట్టాడు. 2013లో బాలుడి తల్లి మరణించడంతో, అప్పటి నుంచి తాత, మేనమామల వద్ద ఉంటున్నాడు. అదనపు కట్నం కోసం బాలుడి తండ్రి, తల్లిని కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మరణంపై పిల్లాడి తాత, అతని తండ్రిపై కేసు పెట్టాడు. పిల్లాడి కస్టడీ కోసం ఇటు తల్లి తరుపువారు, అటు తండ్రి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే అభయ్ సింగ్ తండ్రి, తన కొడుకును మేనమామలు, తాత చంపాడని పిలిభిత్లో కేసు నమోదు చేశారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Asaduddin Owaisi: బీఆర్ఎస్, కాంగ్రెస్ పెళ్లి పోస్టర్.. బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు..
అయితే ఈ కేసును కొట్టేయాలని పిల్లాడి తల్లి తరుపు కుటుంబం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది, అయితే కోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సుప్రీంలో హత్య విచారణ సమయంలో ‘నేను బతికే ఉన్నాను’అని పిల్లాలు చెప్పాడు. ఈ విషయాన్ని గమనించిన కోర్టు పిలిభిత్ ఎస్పీ, న్యూరియా పోలీస్ స్టేషన్ లోని ఎస్హెచ్ఓల నుంచి నివేదిక కోరింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిల్లాడి తాతపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు అధికారుల్ని ఆదేశించింది.
ఈ సందర్భంగా.. పిల్లాడు అభయ్ సింగ్ మాట్లాడుతూ.. నేను మా తాతయ్య వద్దే ఉంటున్నాను, పోలీసులు మా ఇంటికి వచ్చి మా తాతను బెదిరిస్తున్నారు. నేను వారితోనే ఉండాలని అనుకుంటున్నాను, అందుకు కేసు మూసేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కట్నం తెవాలని కొట్టడం అభయ్ సింగ్ తండ్రి కొట్టడంతోనే అతని తల్లి మరణించిందని, దీనిపై పిల్లాడి తాత కేసు పెట్టడంతో, తన కుమారుడిని హత్య చేశారని తండ్రి తప్పుడు కేసు పెట్టాడని పిల్లాడి తరుపు న్యాయవాది కుల్దీప్ జౌహరీ తెలిపాడు. దీనిపై జనవరిలో సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.
తాజావార్తలు
-
OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
-
OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
-
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
-
OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!