Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..
- భర్త వేరే మహిళతో సహజీవనం చేసినా అది గృహహింసనే..
- భార్యకు మెయింటనెన్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిందే..
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. నివేదికల ప్రకారం.. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ పిటిషన్ని కొట్టేస్తూ ఈ తీర్పు చెప్పారు. మానసిక వేధింపులు, రూ. 3 లక్షల పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ. 30,000 సహా, భార్య గాయాలకు నష్టపరిహారంగా రూ. 5 లక్షలు ఇవ్వడాన్ని భర్త సవాల్ చేశాడు.
ఈ జంటకు 1998లో వివాహం జరిగింది. తన భర్త తనను మాసిసికంగా మాటలతో, శారీరకంగా వేధించాడని భార్య ఫిర్యాదు చేసింది. భర్త 2010లో వేరొక మహిళని ఇంటికి తీసుకువచ్చి, తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వీరిద్దరికి అప్పటికే సంబంధం ఉంది. భార్యతో కలిసి ఉండటం మానేశాడు. తన అత్తమామలు బెదిరించడంతో పాటు, సదరు మహిళపై చర్యలు తీసుకుంటే తనకు, తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం మానేస్తానని భర్త హెచ్చరించినట్లు భార్య తెలిపింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కూతురు కూడా ఉందని ఆరోపించింది.
Also Read
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
Read Also: Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు
పరిహారం ఇవ్వడానికి నిరాకరించిన భర్త అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. భార్య ఫిర్యాదు గృహహింస చట్టం పరిధిలోకి రాదనే అతడి వాదనతో విభేదించింది. భర్త వేరే మహిళతో కలిసి జీవించాన్ని సహించలేకే భార్య తన వైవాహిక ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. పరిస్థితులను బట్టి తన పిల్లలతో కలిసి, భర్త అత్తామామలను వదిలేయడం తప్పితే భార్యకు వేరే మార్గం లేదని, ఆమె చర్యల్ని కోర్టు సమర్థించింది.
ఈ కేసులో భార్యకు నెలకు ఖర్చుల కోసం రూ. 30,000 ఇవ్వాలని, భార్య సంపాదించగల సామర్థ్యాన్ని దీనికి వ్యతిరేకంగా చూపొద్దని, భార్య పనిచేస్తుందా..? లేదా..? అనే దానితో సంబంధం లేకుండా తన భార్య, పిల్లల పోషించడం భర్త బాధ్యత అని కోర్టు పేర్కొంది. చాలా మంది భారతీయ మహిళలు తమ కుటుంబాలు, పిల్లలు, అత్తమామల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను కూడా వదిలేస్తున్నారని కోర్టు పేర్కొంది. తన భార్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని భర్త చేసిన వాదన మహిళలందర్ని అవమానించడమే అని పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!