Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..
- భర్త వేరే మహిళతో సహజీవనం చేసినా అది గృహహింసనే..
- భార్యకు మెయింటనెన్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిందే..
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. నివేదికల ప్రకారం.. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ పిటిషన్ని కొట్టేస్తూ ఈ తీర్పు చెప్పారు. మానసిక వేధింపులు, రూ. 3 లక్షల పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ. 30,000 సహా, భార్య గాయాలకు నష్టపరిహారంగా రూ. 5 లక్షలు ఇవ్వడాన్ని భర్త సవాల్ చేశాడు.
ఈ జంటకు 1998లో వివాహం జరిగింది. తన భర్త తనను మాసిసికంగా మాటలతో, శారీరకంగా వేధించాడని భార్య ఫిర్యాదు చేసింది. భర్త 2010లో వేరొక మహిళని ఇంటికి తీసుకువచ్చి, తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వీరిద్దరికి అప్పటికే సంబంధం ఉంది. భార్యతో కలిసి ఉండటం మానేశాడు. తన అత్తమామలు బెదిరించడంతో పాటు, సదరు మహిళపై చర్యలు తీసుకుంటే తనకు, తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం మానేస్తానని భర్త హెచ్చరించినట్లు భార్య తెలిపింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కూతురు కూడా ఉందని ఆరోపించింది.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు
పరిహారం ఇవ్వడానికి నిరాకరించిన భర్త అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. భార్య ఫిర్యాదు గృహహింస చట్టం పరిధిలోకి రాదనే అతడి వాదనతో విభేదించింది. భర్త వేరే మహిళతో కలిసి జీవించాన్ని సహించలేకే భార్య తన వైవాహిక ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. పరిస్థితులను బట్టి తన పిల్లలతో కలిసి, భర్త అత్తామామలను వదిలేయడం తప్పితే భార్యకు వేరే మార్గం లేదని, ఆమె చర్యల్ని కోర్టు సమర్థించింది.
ఈ కేసులో భార్యకు నెలకు ఖర్చుల కోసం రూ. 30,000 ఇవ్వాలని, భార్య సంపాదించగల సామర్థ్యాన్ని దీనికి వ్యతిరేకంగా చూపొద్దని, భార్య పనిచేస్తుందా..? లేదా..? అనే దానితో సంబంధం లేకుండా తన భార్య, పిల్లల పోషించడం భర్త బాధ్యత అని కోర్టు పేర్కొంది. చాలా మంది భారతీయ మహిళలు తమ కుటుంబాలు, పిల్లలు, అత్తమామల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను కూడా వదిలేస్తున్నారని కోర్టు పేర్కొంది. తన భార్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని భర్త చేసిన వాదన మహిళలందర్ని అవమానించడమే అని పేర్కొంది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?