Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..
- భర్త వేరే మహిళతో సహజీవనం చేసినా అది గృహహింసనే..
- భార్యకు మెయింటనెన్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిందే..
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. నివేదికల ప్రకారం.. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ పిటిషన్ని కొట్టేస్తూ ఈ తీర్పు చెప్పారు. మానసిక వేధింపులు, రూ. 3 లక్షల పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ. 30,000 సహా, భార్య గాయాలకు నష్టపరిహారంగా రూ. 5 లక్షలు ఇవ్వడాన్ని భర్త సవాల్ చేశాడు.
ఈ జంటకు 1998లో వివాహం జరిగింది. తన భర్త తనను మాసిసికంగా మాటలతో, శారీరకంగా వేధించాడని భార్య ఫిర్యాదు చేసింది. భర్త 2010లో వేరొక మహిళని ఇంటికి తీసుకువచ్చి, తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వీరిద్దరికి అప్పటికే సంబంధం ఉంది. భార్యతో కలిసి ఉండటం మానేశాడు. తన అత్తమామలు బెదిరించడంతో పాటు, సదరు మహిళపై చర్యలు తీసుకుంటే తనకు, తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం మానేస్తానని భర్త హెచ్చరించినట్లు భార్య తెలిపింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కూతురు కూడా ఉందని ఆరోపించింది.
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
Read Also: Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు
పరిహారం ఇవ్వడానికి నిరాకరించిన భర్త అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. భార్య ఫిర్యాదు గృహహింస చట్టం పరిధిలోకి రాదనే అతడి వాదనతో విభేదించింది. భర్త వేరే మహిళతో కలిసి జీవించాన్ని సహించలేకే భార్య తన వైవాహిక ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. పరిస్థితులను బట్టి తన పిల్లలతో కలిసి, భర్త అత్తామామలను వదిలేయడం తప్పితే భార్యకు వేరే మార్గం లేదని, ఆమె చర్యల్ని కోర్టు సమర్థించింది.
ఈ కేసులో భార్యకు నెలకు ఖర్చుల కోసం రూ. 30,000 ఇవ్వాలని, భార్య సంపాదించగల సామర్థ్యాన్ని దీనికి వ్యతిరేకంగా చూపొద్దని, భార్య పనిచేస్తుందా..? లేదా..? అనే దానితో సంబంధం లేకుండా తన భార్య, పిల్లల పోషించడం భర్త బాధ్యత అని కోర్టు పేర్కొంది. చాలా మంది భారతీయ మహిళలు తమ కుటుంబాలు, పిల్లలు, అత్తమామల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను కూడా వదిలేస్తున్నారని కోర్టు పేర్కొంది. తన భార్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని భర్త చేసిన వాదన మహిళలందర్ని అవమానించడమే అని పేర్కొంది.
తాజావార్తలు
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!