Delhi HC: భర్త వేరే మహిళలతో సహజీవనం చేసినా ‘‘గృహ హింస’’గానే పరిగణించబడుతుంది..
- భర్త వేరే మహిళతో సహజీవనం చేసినా అది గృహహింసనే..
- భార్యకు మెయింటనెన్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సిందే..
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. నివేదికల ప్రకారం.. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ పిటిషన్ని కొట్టేస్తూ ఈ తీర్పు చెప్పారు. మానసిక వేధింపులు, రూ. 3 లక్షల పరిహారం, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ. 30,000 సహా, భార్య గాయాలకు నష్టపరిహారంగా రూ. 5 లక్షలు ఇవ్వడాన్ని భర్త సవాల్ చేశాడు.
ఈ జంటకు 1998లో వివాహం జరిగింది. తన భర్త తనను మాసిసికంగా మాటలతో, శారీరకంగా వేధించాడని భార్య ఫిర్యాదు చేసింది. భర్త 2010లో వేరొక మహిళని ఇంటికి తీసుకువచ్చి, తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వీరిద్దరికి అప్పటికే సంబంధం ఉంది. భార్యతో కలిసి ఉండటం మానేశాడు. తన అత్తమామలు బెదిరించడంతో పాటు, సదరు మహిళపై చర్యలు తీసుకుంటే తనకు, తన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడం మానేస్తానని భర్త హెచ్చరించినట్లు భార్య తెలిపింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కూతురు కూడా ఉందని ఆరోపించింది.
Also Read
Read Also: Harsha Sai: పెళ్లి చేసుకుంటానని హ్యాండ్ ఇచ్చాడు.. హర్ష సాయిపై బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఫిర్యాదు
పరిహారం ఇవ్వడానికి నిరాకరించిన భర్త అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. భార్య ఫిర్యాదు గృహహింస చట్టం పరిధిలోకి రాదనే అతడి వాదనతో విభేదించింది. భర్త వేరే మహిళతో కలిసి జీవించాన్ని సహించలేకే భార్య తన వైవాహిక ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది. పరిస్థితులను బట్టి తన పిల్లలతో కలిసి, భర్త అత్తామామలను వదిలేయడం తప్పితే భార్యకు వేరే మార్గం లేదని, ఆమె చర్యల్ని కోర్టు సమర్థించింది.
ఈ కేసులో భార్యకు నెలకు ఖర్చుల కోసం రూ. 30,000 ఇవ్వాలని, భార్య సంపాదించగల సామర్థ్యాన్ని దీనికి వ్యతిరేకంగా చూపొద్దని, భార్య పనిచేస్తుందా..? లేదా..? అనే దానితో సంబంధం లేకుండా తన భార్య, పిల్లల పోషించడం భర్త బాధ్యత అని కోర్టు పేర్కొంది. చాలా మంది భారతీయ మహిళలు తమ కుటుంబాలు, పిల్లలు, అత్తమామల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను కూడా వదిలేస్తున్నారని కోర్టు పేర్కొంది. తన భార్య చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని భర్త చేసిన వాదన మహిళలందర్ని అవమానించడమే అని పేర్కొంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!