Domestic Violence: తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింస ఎలా అవుతుంది.? భార్య పిటిషన్ కొట్టేసిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Domestic Violence: తన భర్త, అత్తామామలపై భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేసింది. మహిళ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి తన తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించబడదని చెప్పింది. అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి కోర్టు) ఆశిష్ అయాచిత్, మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో.. మహిళ ఫిర్యాదు అస్పష్టంగా ఉందని, భర్త, అత్తామామలు గృహ హింస వేధింపులకు పాల్పడినట్లు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళ గృహ హింస నుంచి రక్షించాలని, తనకు పరిహారంగా డబ్బు ఇవ్వాలని ఫిర్యాదు చేసింది. తన తల్లి మానసిక ఆరోగ్యాన్ని బయటపెట్టకుండా తనను పెళ్లి చేసుకున్నట్లు ఆరోపించింది. తన అత్తగారు తాను ఉద్యోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని, తనను వేధించేవారని, భర్త మరియు అతని తల్లి తనతో గొడవ పడేవారని మహిళ పేర్కొంది. తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం కోసం విదేశాల్లో ఉన్నాడని, అతను సెలవుపై ఇండియా వచ్చినప్పుడల్లా, తన తల్లి వద్దకు వెళ్లేవాడని, ప్రతీ ఏడాది రూ. 10,000 పంపేవాడని, ఆమె కంటి ఆపరేషన్ కోసం కూడా ఖర్చు పెట్టాడని సదరు మహిళ తెలిపింది. తన అత్తామామల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వేధింపుకు గురిచేసేవారని ఆరోపించింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Botsa Satyanarayana: నాకు సీఎం అయ్యే ఛాన్స్ వస్తే.. చిరంజీవి అడ్డుపడ్డారు..
అయితే, కోడలు చేస్తున్న ఆరోపణల్ని అత్తామామలు కొట్టిపారేశారు. తను భర్తగా ఆమె ఎప్పుడూ అంగీకరించలేదని ఆమె భర్త ఫిర్యాదు ఆరోపించాడు. ఆమె క్రూరత్వం కారణంగా తాను ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశానని చెప్పాడు. ఎటువంటి సమాచారం లేకుండా తన భార్య తన NRE (నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్) ఖాతా నుండి ₹ 21.68 లక్షలు విత్డ్రా చేసిందని, ఆ మొత్తంతో ఫ్లాట్ను కొనుగోలు చేశారని కూడా అతను ఆరోపించాడు. మహిళ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ. 3000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే, ఆమె ఇతరుల సాక్ష్యాలు నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టేసింది. భరణాన్ని రద్దు చేసింది.
ఈ పరిణామంలో మహిళ ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత మహిళ వాదనలు అస్పష్టంగా ఉన్నాయని, ఆమె గృహ హింసకు గురికాలేదని, తల్లికి డబ్బులు ఇవ్వడం, సమయాన్ని కేటాయించడం గృహ హింస కిందకు రాదని కోర్టు పేర్కొంది. విడాకులు కోరుతూ భర్త, నోటీసులు జారీ చేసిన తర్వాతే మహిళ ఈ రకమైన ఆరోపణలు చేస్తుందనే విషయాన్ని గుర్తు గుర్తించింది. ఆమె గృహ హింస నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి అర్హత లేదని చెప్పింది. ట్రయల్ కోర్టు తీర్పులో సెషన్స్ కోర్టు జోక్యం చేసుకోవాల్సి అవసరం లేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
-
Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!