Punjab: భార్య నిరాకరించడంతో భర్త దారుణం.. ఐదుగురి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband burned his wife and children alive in punjab: పచ్చని సంసారాన్ని క్షణికావేశం బుగ్గి చేసింది. భార్య, భర్తల మధ్య గొడవ ఐదుగురి మరణాలకు కారణం అయింది. భార్య తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ భర్త వద్దకు తిరిగి రావడానికి నిరాకరించడంతో భర్త ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. తన ఇద్దరు పిల్లలను కూడా క్రూరంగా కాల్చివేశాడు నిందితుడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి భార్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులను సజీవ దహనం చేశాడని పంజాబ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు.
పరమ్ జీత్ కౌర్ తన పిల్లలతో కలిసి గత ఐదారు నెలల నుంచి తల్లిదండ్రులతో ఉంటోంది. అయితే భర్త కుల్దీప్ సింగ్ లూథియానాలోని ఖుర్షేడ్ పూర్ గ్రామానికి తిరిగి రావాలని కోరుతున్నాడు. భర్త ఎంతగా బ్రతిమిలాడిన భార్య వినకపోవడంతో దారుణానికి తెగబడ్డాడు. అయితే కుల్దీప్ సింగ్ భార్యతో పాటు పిల్లలను కొట్టేవాడని అందుకే అతనితో వెళ్లేందుకు తను నిరాకరించేదని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇదిలా ఉంటే సోమవారం అర్థరాత్రి కుల్దీప్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి నిద్రిస్తున్న ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. భార్య పరమ్ జీత్ కౌర్ తో పాటు ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగిందేరో, 8,5 ఏళ్ల పిల్లలు అర్ష్ దీప్, అన్మోల్ సజీవం దహనం అయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కుల్దీప్ సింగ్ పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని జలంధర్ రూరల్ ఎస్పీ సత్బ్ జీత్ సింగ్ వెల్లడించారు. నిందితుడిపై హత్యానేరం కేసు నమోదు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!