Pakistan: పాకిస్తాన్కు మోదీ కావాలి.. నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis- Viral Video: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రజలకు భారత్ విలువ తెలుస్తోంది. మాకు నరేంద్రమోదీ లాంటి ప్రధాని కావాలంటూ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ జర్నలిస్ట్, యూట్యూబర్ సనా అమ్జాద్ ఓ యువకుడిని ‘‘ పాకిస్తాన్ నుంచి బతికి బట్టకట్టాలంటే మనం ఇండియాకు వెళ్లాలి’’ అని ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించిన సందర్భంలో ఆతను చెప్పిన సమాధానం ప్రస్తుతం రెండు దేశాల్లో వైరల్ గా మారింది.
Read Also: Surrogacy Mother: 56ఏళ్ల వయసులో మనవడికి జన్మనిచ్చిన నాయనమ్మ
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
- Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
తమకు ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, జెనజీర్, ముషారఫ్ వద్దని తమకు కేవలం నరేంద్ర మోదీ కావాలంటూ ఆ యువకుడు చెప్పిన మాటలు ఇటు ఇండియాలో, అటు పాక్ లో వైరల్ అవుతున్నాయి. పాక్ ప్రధాని షెషబాజ్ షరీఫ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మోదీ పాకిస్తాన్ ప్రధాని అయితే పాక్ ప్రజలకు కూడా తక్కువ ధరకే ఆహార పదార్థాలు, కూరగాయలు దొరికేవని అన్నాడు. తాను పాకిస్తాన్లో పుట్టకుంటే బాగుండేదని నిరుత్సాహంతో చెప్పడం వీడియోలో చూడవచ్చు.
మోదీ మనకన్నా గొప్పవాడు, ఆయన ప్రజలను ఎంతగానో గౌరవిస్తారు. పాకిస్తాన్ కు కూడా నరేంద్ర మోదీ ఉంటే నవాజ్ షరీఫ్, బెనజీర్చ ఇమ్రాన్ అవసరం లేదని, మనకు కావాల్సినవి ప్రధాని మోదీ మాత్రమే తీర్చుతారని అన్నారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, పాకిస్తాన్ ఎక్కడ లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మోదీ గొప్పవ్యక్తి అని, చెడ్డ వ్యక్తి కాదని అన్నాడు. భారతీయులకు కిలో టొమాటోలు రూ. 20కి, కిలో చికెన్ రూ. 150కి లభిస్తున్నాయని.. మనం మాత్రం రాత్రి పూట పిల్లలకు ఆహారం ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంగా ఉంటే మనం కూడా భారతీయ ముస్లింల లాగే ఉండేవాళ్లమని దీంట్లో తేడా ఏముంటుందని ప్రశ్నించారు. భారత దేశంతో స్నేహం చేస్తే టొమాటోలు, చికెన్ చవకగా లభిస్తాయని పాక్ ప్రభుత్వానికి సూచించాడు. పాక్, భారత్ ఒకే దేశంగా ఉంటే బాగుండేది అని అన్నాడు.
"Hamen Modi Mil Jaye bus, Na hamen Nawaz Sharif Chahiye, Na Imran, Na Benazir chahiye, General Musharraf bhi nahi chahiye"
Ek Pakistani ki Khwahish 😉 pic.twitter.com/Wbogbet2KF
— Meenakshi Joshi (@IMinakshiJoshi) February 23, 2023
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!