Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ఎంత సంపద ఉన్నది అని కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం. సంపద ఉండి.. సంపాదించే శక్తి, వయసు ఉండి పరులకు పైసా దానం చెయ్యాలంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన ఓ వృద్ధురాలు తనకు ఆసరాగా ఉన్న భూమిని భావిభారత పౌరుల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా దానం చేసింది. బ్రతకు దెరువుకు ఆ పాఠశాల లోనే వంట మనిషిగా చేరి జీవనాన్ని గడుపుతుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని కొప్పాల ప్రాంతానికి చెందిన హుచ్చమ్మ చౌదరికి రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక ప్రభుత్వం జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర స్థాపన సందర్భంగా నవంబర్ 1వ తేదీన రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేస్తుంది.
Read also:BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
కాగా ఈ సంవత్సరం కూడా రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించింది. కాగా ఈ సంవత్సరం కొప్పాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాజ్యోత్సవ అవార్డులు అందుకున్నారు.అవార్డుకు ఎంపికైన వాళ్ళు కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి, మోరనాల గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారుడు కేశప్ప శిల్లిక్యాతర, కరటగి తాలూకా సిద్ధాపురానికి చెందిన గుండప్ప విభూతి అవార్డుకు ఎంపికయ్యారు. కాగా కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి ఈ అవార్డుకు నమోదు చేసుకోలేదు. కానీ ఆమె నిస్వార్ధనికి అవార్డు ఆ వృద్ధురాలిని వెతుకుంటూ వచ్చింది. దీనికి కారణం 68 సంవత్సరాల వయసులో తనకి ఆసరాగా ఉన్న రెండు ఎకరాల పొలంని తన్నూరులోని పాఠశాలకు విరాళంగా ఇచ్చారు.
అనంతరం జీవనోపాధి కోసం ఆ పాఠశాల లోనే వంటమనిషిగా చేరారు. అయితే పిల్లలు లేని హుచ్చమ్మ ఆ పాఠశాల పిల్లలే తన పిల్లలుగా భావించి సంతోష పడుతుంది. ఈ నేపథ్యంలో దేశం లోని మఠాలు, సంస్థలు హుచ్చమ్మను వెతుక్కుంటూ వచ్చి అవార్డులతో సత్కరించాయి. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రాజ్యోత్సవ అవార్డును హుచ్చమ్మకు అందించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపింది. కాగా అవార్డు గర్హితకు రూ/ లక్ష నగదుతో పాటుగా 25 గ్రాముల బంగారం అందిస్తారు.
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!