Huchamma Chowdhury: బడికోసం స్థలం దానమిచ్చి వృద్దురాలు ..నిస్వార్ధానికి రాజ్యోత్సవ అవార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: ఎంత సంపద ఉన్నది అని కాదు.. మన దగ్గర ఉన్న సంపద సమాజం శ్రేయస్సుకు ఎంత వరకు ఉపయోగపడిందనేదే ముఖ్యం. సంపద ఉండి.. సంపాదించే శక్తి, వయసు ఉండి పరులకు పైసా దానం చెయ్యాలంటే మనం ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మిన ఓ వృద్ధురాలు తనకు ఆసరాగా ఉన్న భూమిని భావిభారత పౌరుల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా దానం చేసింది. బ్రతకు దెరువుకు ఆ పాఠశాల లోనే వంట మనిషిగా చేరి జీవనాన్ని గడుపుతుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని కొప్పాల ప్రాంతానికి చెందిన హుచ్చమ్మ చౌదరికి రాజ్యోత్సవ అవార్డును కర్ణాటక ప్రభుత్వం జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర స్థాపన సందర్భంగా నవంబర్ 1వ తేదీన రాజ్యోత్సవ అవార్డును ప్రదానం చేస్తుంది.
Read also:BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
కాగా ఈ సంవత్సరం కూడా రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించింది. కాగా ఈ సంవత్సరం కొప్పాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రాజ్యోత్సవ అవార్డులు అందుకున్నారు.అవార్డుకు ఎంపికైన వాళ్ళు కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి, మోరనాల గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారుడు కేశప్ప శిల్లిక్యాతర, కరటగి తాలూకా సిద్ధాపురానికి చెందిన గుండప్ప విభూతి అవార్డుకు ఎంపికయ్యారు. కాగా కొప్పల్ తాలూకాకు చెందిన హుచ్చమ్మ చౌదరి ఈ అవార్డుకు నమోదు చేసుకోలేదు. కానీ ఆమె నిస్వార్ధనికి అవార్డు ఆ వృద్ధురాలిని వెతుకుంటూ వచ్చింది. దీనికి కారణం 68 సంవత్సరాల వయసులో తనకి ఆసరాగా ఉన్న రెండు ఎకరాల పొలంని తన్నూరులోని పాఠశాలకు విరాళంగా ఇచ్చారు.
అనంతరం జీవనోపాధి కోసం ఆ పాఠశాల లోనే వంటమనిషిగా చేరారు. అయితే పిల్లలు లేని హుచ్చమ్మ ఆ పాఠశాల పిల్లలే తన పిల్లలుగా భావించి సంతోష పడుతుంది. ఈ నేపథ్యంలో దేశం లోని మఠాలు, సంస్థలు హుచ్చమ్మను వెతుక్కుంటూ వచ్చి అవార్డులతో సత్కరించాయి. కాగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన రాజ్యోత్సవ అవార్డును హుచ్చమ్మకు అందించడం జిల్లా వాసుల్లో ఆనందాన్ని నింపింది. కాగా అవార్డు గర్హితకు రూ/ లక్ష నగదుతో పాటుగా 25 గ్రాముల బంగారం అందిస్తారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!