Uttarakhand Tunnel Rescue: అత్యాధునిక టెక్నాలజీ వల్ల కాలేదు.. ‘పురాతన ర్యాట్ హోల్ మైనింగ్’ 41 మందిని కాపాడుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి వచ్చింది. మరికొద్ది సేపటిలో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు బయటకు రాబోతున్నాయి. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ కుప్పకూలిపోవడంతో గత 17 రోజులుగా కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. అయితే అప్పటి నుంచి అధికారులతో పాటు విదేశాలకు చెందిన టెన్నెల్ నిపుణులు ఈ ఆపరేషన్లో భాగమవుతున్నారు. మరికొద్ది సేపట్లో కార్మికులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్లింది.
అయితే అమెరికాకు చెందిన ఆగర్ మిషన్, ఇతర అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రెస్యూ ఆపరేషన్ నిర్వహించినా ఫలితాలు రాలేదు. చివరకు పురాతనమైన ‘‘ర్యాట్-హోల్ మైనింగ్’’ పద్దతి ద్వారా కార్మికులను రెస్క్యూ చేయబోతున్నారు. కార్మికులకు మరికొన్ని మీటర్ల దూరంలో రెస్క్యూ సిబ్బంది ఉంది.
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
ర్యాట్-హోట్ మైనింగ్ అంటే..
ర్యాట్ హోల్ మైనింగ్ అనేది బొగ్గును వెలికి తీయడానికి ఉపయోగించే పురాతన పద్ధతి. ఈ పద్ధతిలో 4 అడుగుల వెడల్పు కన్నా చిన్నగా ఉండే గుంటలను తవ్వడం ద్వారా బొగ్గును వెలికితీస్తారు. బొగ్గును వెలికి తీసేందుకు పక్కకు సొరంగాలను చేస్తారు. నైపుణ్యం కార్మికులు పనిముట్లను ఉపయోగించి మాన్యువల్గా ఈ ప్రక్రియను చేస్తారు. మేఘాలయ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ర్యాట్ హోట్ మైనింగ్ ప్రక్రియను వాడుతున్నారు. మైనర్లు ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు, ఎందుకంటే వీరికి సరిపోయేలా ఈ పద్ధతి ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఒకరు డ్రిల్లింగ్ చేస్తుంటే, మరొకరు శిథిలాలను తొలగిస్తారు, మరొకరు వాటిని బయటపారేస్తారు.

ర్యాట్ హోల్ మైనింగ్పై నిషేధం:
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2014లో ర్యాట్ హోల్ మైనింగ్ను అశాస్త్రీయమని నిషేధించింది. అయినా కూడా ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రమాదాలు పెరగడం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో మైనర్ పిల్లలు మరణాలకు దారి తీశాయి. 2018లో అక్రమ మైనింగ్లో పాల్గొన్న 15 మంది పురుషులు8 వరదల కారనంగా గనిలో చిక్కుకుపోయారు. నెలల తరబడి సాగిని ఈ రెస్క్యూ ఆపరేషన్లో కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. ఇలాగే 2021లో ఐదుగురు మైనర్లు వరదల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో 3 మృతదేహాలు లభించాయి.
టెక్నాలజీ వల్ల కాలేదు..
అమెరికన్ ఆగర్ యంత్రం ద్వారా శిథిలాలను డ్రిల్లింగ్ చేసి కార్మికులను రక్షించాలని భావించారు. అయితే 57 మీటర్ల దూరంలో ఉన్న కార్మికులను రక్షించేందుకు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. పలు సందర్భాల్లో యంత్రం చెడిపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది. వర్టికల్ డ్రిల్లింగ్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ర్యాట్ హోల్ డ్రిల్లింగ్ కోసం ఢిల్లీ నుంచి రెండు స్పెషలిస్ట్ టీములను, మొత్తం 12 మందిని రప్పించారు. తీసుకువచ్చని వారు పురాతన విధానానికి సాంకేతికతను జోడించే పని చేసే నిపుణులని.. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వీరు 800 ఎంఎం పైపు లోపట చేతిలో ఇమిడిపోయే సాధనాలను ఉపయోగించి మాన్యువల్గా డ్రిల్లింగ్ చేస్తూ చెత్తను బయటపారేస్తారు.
తాజావార్తలు
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!