భారత్లో బీజేపీ దూసుకుపోతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి 21 రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ms.ilayaa : మొదలైన “మిస్ ఇళయా”!
మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, హర్యానా, గుజరాత్, గోవా, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, తాజాగా ఢిల్లీ వచ్చి చేరింది. ఇలా మొత్తం బీజేపీ, మిత్ర రాష్ట్రాలు కలిసి 21 రాష్ట్రాలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Minister Satyakumar Yadav: ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..
ఇక దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లోనే ఉంది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో హిమాచల్ప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ కూడా పాగా వేస్తామని బీజేపీ అంటోంది. తమిళనాడు, కేరళ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్లో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Minister Satyakumar Yadav: ఢిల్లీలో బీజేపీ విజయం.. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి..