భారత్లో బీజేపీ దూసుకుపోతుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు మినహా.. మిగతా రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. ఇక తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి 21 రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుంది. మిత్ర రాష్ట్రాలతో కలిసి మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి.