Honeymoon Murder Case: సోనమ్ రఘువంశీ బెయిల్ పిటిషన్.. ఛార్జ్ షీట్ లోపాలపై ఆరోపణ..
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం..
- బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సోనమ్..
- భర్త రాజా రఘువంశీని ప్లాన్ చేసి చంపిన సోనమ్..
- మేఘాలయలో కిరాయి హంతకులతో హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’లో కీలక పరిణామం ఎదురైంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్త రాజ రఘువంశీని హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హతమార్చింది. ఈ హత్యలో సోనమ్ కీలక నిందితురాలు కాగా, ఈ హత్యను తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి ప్లాన్ చేసింది. రాజా రఘువంశీని ముగ్గురు కిరాయి హంతకులు సోహ్రాలోని వీసావ్డాంగ్ సమీపంలో హత్య చేశారు.
Read Also: Cable Bridge: వందల కోట్లు వెచ్చించి కట్టిన కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన వైనం..!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
సోనమ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సోహ్రా సబ్-డివిజన్లోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెప్టెంబర్ 17న విచారించనుంది. శుక్రవారం ఆమె పిటిషన్ దాఖలు చేసినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చంద్ర తెలిపారు. అయితే, కేసు రికార్డులను పరిశీలించడానికి ప్రాసిక్యూషన్ సమయం కోరింది. ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యలో దాఖలు చేసిన ఛార్జి షీట్లో లోపాలు ఉన్నాయని సోనమ్ న్యాయవాది పేర్కొన్నారు.
మే నెలలో మేఘాలయకు వెళ్లిన సోనమ్, రాజ్ లు కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల వెతుకులాట తర్వాత రాజ్ మృతదేహం లభించింది. దీని తర్వాత, సోనమ్ యూపీ పోలీసుల ముందు లొంగిపోయింది. దీంతో మొత్తం కేసుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం మేఘాలయ పోలీసులు సోనమ్, రాజ్లతో పాటు ముగ్గురు కిరాయి హంతకులు -విశాల్ సింగ్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మిలపై 790 పేజీల చార్జిషీట్ను సమర్పించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!