Sheikh Hasina: బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి అరెస్ట్పై స్పందించిన మాజీ పీఎం షేక్ హసీనా..
- చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన షేక్ హసీనా..
- మైనారిటీలపై దాడుల్ని ఖండించిన మాజీ ప్రధాని..
- హిందూ సన్యాసిని వెంటనే వదిలేయాలని డిమాండ్..
- మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం..
Sheikh Hasina: బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు.
చిన్మోయ్ అరెస్టుపై బంగ్లాదేశ్ మాజీ సీఎం షేక్ హసీనా స్పందించారు. ‘‘సనాతన్ మత సంఘానికి చెందిన ఒక అగ్ర నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేశారు, అతన్ని వెంటనే విడుదల చేయాలి. చిట్టగాంగ్లో ఒక ఆలయాన్ని తగులబెట్టారు. గతంలో, మసీదులు, పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మఠాలు మరియు అహ్మదీయ సమాజం యొక్క ఇళ్లపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటివి జరిగాయి.’’ అని ఆమె అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రజలు మతస్వేచ్ఛని బంగ్లా అధికారులు నిర్ధారించాలి’’ అని ఆమె కోరారు.
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
Read Also: Sircilla: కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే- ఐఏఎస్ అధికారుల సంఘం..
ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతల పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధికార గ్రహీత అన్ని రంగాల్లో విఫలమయ్యారు. నిత్యవసర ధరలు పెరగడాన్ని నియంత్రించలేకపోతున్నారు. ప్రజలు జీవితాలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలపై హింసను ఖండిస్తు్న్నట్లు చెప్పారు.
చిట్టగాంగ్లో ఒక న్యాయవాది మరణానికి దారి తీసిన హింసాత్మక సంఘటనలపై షేక్ హసినా తాత్కాలిక ప్రభుత్వాన్ని నిందించారు. టెర్రరిస్టులను శిక్షించడంలో మధ్యంతర ప్రభుత్వం విఫలమైతే, మానవహక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. హత్యా నిందితులను కనుగొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ అవామీ లీగ్ నాయకులు, కార్మికులు, విద్యార్థుల హత్యలు, దాడులు జరుగుతున్నాయని, వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హసీనా అన్నారు.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో