Sheikh Hasina: బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి అరెస్ట్పై స్పందించిన మాజీ పీఎం షేక్ హసీనా..
- చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన షేక్ హసీనా..
- మైనారిటీలపై దాడుల్ని ఖండించిన మాజీ ప్రధాని..
- హిందూ సన్యాసిని వెంటనే వదిలేయాలని డిమాండ్..
- మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు.
చిన్మోయ్ అరెస్టుపై బంగ్లాదేశ్ మాజీ సీఎం షేక్ హసీనా స్పందించారు. ‘‘సనాతన్ మత సంఘానికి చెందిన ఒక అగ్ర నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేశారు, అతన్ని వెంటనే విడుదల చేయాలి. చిట్టగాంగ్లో ఒక ఆలయాన్ని తగులబెట్టారు. గతంలో, మసీదులు, పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మఠాలు మరియు అహ్మదీయ సమాజం యొక్క ఇళ్లపై దాడులు, ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం వంటివి జరిగాయి.’’ అని ఆమె అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రజలు మతస్వేచ్ఛని బంగ్లా అధికారులు నిర్ధారించాలి’’ అని ఆమె కోరారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Sircilla: కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే- ఐఏఎస్ అధికారుల సంఘం..
ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతల పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధికార గ్రహీత అన్ని రంగాల్లో విఫలమయ్యారు. నిత్యవసర ధరలు పెరగడాన్ని నియంత్రించలేకపోతున్నారు. ప్రజలు జీవితాలకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలపై హింసను ఖండిస్తు్న్నట్లు చెప్పారు.
చిట్టగాంగ్లో ఒక న్యాయవాది మరణానికి దారి తీసిన హింసాత్మక సంఘటనలపై షేక్ హసినా తాత్కాలిక ప్రభుత్వాన్ని నిందించారు. టెర్రరిస్టులను శిక్షించడంలో మధ్యంతర ప్రభుత్వం విఫలమైతే, మానవహక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. హత్యా నిందితులను కనుగొని శిక్షించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ అవామీ లీగ్ నాయకులు, కార్మికులు, విద్యార్థుల హత్యలు, దాడులు జరుగుతున్నాయని, వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హసీనా అన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!