Hindu Man Killed: కర్ణాటకలో ఉద్రిక్తత.. ముస్లిం మహిళతో సంబంధం, యువకుడి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కర్ణాటకలో నానుతూనే ఉంది. హైకోర్ట్ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడానికి వ్యతిరేఖంగా తీర్పు చెప్పింది. అయినా కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. మండ్యా, శివమొగ, ఉడిపి, చిక్ బళ్లాపూర్, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈ వివాదంతో పాఠశాలల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా హిజాబ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం మాండ్యాలోని జామియా మసీదు, మంగళూర్ లోని జుమా మసీదు వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో ఈ రెండు మసీదులు దేవాలయాలని…టిప్పు సుల్తాన్ హాయాంలో కూల్చేసి మసీదులుగా మార్చారని హిందు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మంగళూర్ జుమా మసీదులో దేవాలయానికి సబంధించిన నిర్మాణం వెలుగులోకి రావడంతో ఉద్రికత్తత తలెత్తింది.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
ఇదిలా ఉంటే మరోసారి కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ముస్లిం మహిళతో సంబంధం పెట్టుకున్నాడని.. 25 ఏళ్ల హిందూ యువకుడిని కిరాతంగా హతమార్చారు. ఈ ఘటన కలబురిగిలో చోటు చేసుకుంది. దీంతో కలబురిగి జిల్లాలో పోలీసులు భద్రతను పెంచారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
కులబురిగి జిల్లా వాడి పట్టణానికి చెందిన విజయ్ కాంబ్లే, స్థానికంగా ఉన్న ముస్లిం యువతితో రిలేషన్ లో ఉన్నాడు. అయితే వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారని అయితే కుటుంబ సభ్యులు మాత్రం దీనిని వ్యతిరేఖించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయ కాంబ్లేను సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అమ్మాయి తండ్రి, సోదరుడు తన కుమారుడు విజయ కాంబ్లేను హత్య చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందుతులను మస్లిం యువతి సోదరులు షహబుద్దీన్, నవాజ్ గా గుర్తించారు.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!