Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ వివాదం’’..
- సీఎం స్టాలిన్కి కేంద్రమంత్రి లేఖ..
- ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించం, కానీ..
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు, కానీ విదేశీ భాషాలపై అతిగా ఆధారపడటం, విద్యార్థులు భాష మూలాలకు గురికావడాన్ని పరిమితం చేయడం జరుగుతుంది’’ అని కేంద్రమంత్రి లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) భాష స్వేచ్ఛ సూత్రాన్ని సమర్థిస్తుందని, విద్యార్థులు తమకు నచ్చిన భాషలో నేర్చుకోవడాన్ని కొనసాగించేలా చేస్తుందని అన్నారు. మన భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం, బలోపేతం చేయాలని చూస్తున్నామని ఆయన చెప్పారు.
Read Also: Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద రూ.2,152 కోట్లు వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఒక రోజు తర్వాత విద్యా మంత్రి స్పందన వచ్చింది. ‘‘త్రిభాషా విధానం 1968 నుండి భారతదేశ విద్యా వ్యవస్థలో ఉంది. దురదృష్టవశాత్తు విద్యా విధానంలో భాగమైనప్పటికీ, దానిని ఎప్పుడూ అమలు చేయలేదు. దీని ఫలితంగా పాఠశాలల్లో భారతీయ భాషల క్రమబద్ధమైన బోధన క్షీణించింది’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన పేర్కొన్నారు. మే 2022లో చెన్నైలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ చేసిన ‘‘తమిళ భాష శాశ్వతమైంది’’ అనే వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య ‘‘హిందీ వివాదం’’ కొనసాగుతోంది. హిందీని బలవంతంగా విధించేందుకు తమను కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోందని ఆదివారం స్టాలిన్ ఆరోపించారు. తమ రాష్ట్రం అమలు చేస్తున్న ‘‘రెండు భాషల’’ విధానాన్ని వదులుకోమని చెప్పారు. ఈ వివాదంపై సీఎం కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘‘ ఇది ద్రవిడ భూమి, పెరియార్ భూమి. తమిళ ప్రజల హక్కుల్ని హరించడానికి ప్రయత్నించినప్పుడు, ‘‘గో బ్యాక్ మోడీ’’ని ప్రారంభించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ‘‘గెట్ అవుట్ మోడీ’’ అనే స్వరం వినిపిస్తోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో