Hindi Row: ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించే ప్రశ్నే లేదు, కానీ.. హిందీ వివాదంపై కేంద్రమంత్రి..
- కేంద్రం, తమిళనాడు మధ్య ‘‘హిందీ వివాదం’’..
- సీఎం స్టాలిన్కి కేంద్రమంత్రి లేఖ..
- ఏ రాష్ట్రంపై ఏ భాషను విధించం, కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు, కానీ విదేశీ భాషాలపై అతిగా ఆధారపడటం, విద్యార్థులు భాష మూలాలకు గురికావడాన్ని పరిమితం చేయడం జరుగుతుంది’’ అని కేంద్రమంత్రి లేఖలో స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) భాష స్వేచ్ఛ సూత్రాన్ని సమర్థిస్తుందని, విద్యార్థులు తమకు నచ్చిన భాషలో నేర్చుకోవడాన్ని కొనసాగించేలా చేస్తుందని అన్నారు. మన భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటం, బలోపేతం చేయాలని చూస్తున్నామని ఆయన చెప్పారు.
Read Also: Sambhaji Maharaj: శంభాజీ మహారాజ్పై వివాదాస్పద కంటెంట్.. వికీపీడియా ఎడిటర్లపై కేసు..
Also Read
భాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద రూ.2,152 కోట్లు వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఒక రోజు తర్వాత విద్యా మంత్రి స్పందన వచ్చింది. ‘‘త్రిభాషా విధానం 1968 నుండి భారతదేశ విద్యా వ్యవస్థలో ఉంది. దురదృష్టవశాత్తు విద్యా విధానంలో భాగమైనప్పటికీ, దానిని ఎప్పుడూ అమలు చేయలేదు. దీని ఫలితంగా పాఠశాలల్లో భారతీయ భాషల క్రమబద్ధమైన బోధన క్షీణించింది’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన పేర్కొన్నారు. మే 2022లో చెన్నైలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ చేసిన ‘‘తమిళ భాష శాశ్వతమైంది’’ అనే వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య ‘‘హిందీ వివాదం’’ కొనసాగుతోంది. హిందీని బలవంతంగా విధించేందుకు తమను కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోందని ఆదివారం స్టాలిన్ ఆరోపించారు. తమ రాష్ట్రం అమలు చేస్తున్న ‘‘రెండు భాషల’’ విధానాన్ని వదులుకోమని చెప్పారు. ఈ వివాదంపై సీఎం కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ..‘‘ ఇది ద్రవిడ భూమి, పెరియార్ భూమి. తమిళ ప్రజల హక్కుల్ని హరించడానికి ప్రయత్నించినప్పుడు, ‘‘గో బ్యాక్ మోడీ’’ని ప్రారంభించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి ‘‘గెట్ అవుట్ మోడీ’’ అనే స్వరం వినిపిస్తోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!