Sandeshkhali: మీరు కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం చీకటి కాదు.. మమతా సర్కార్పై హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: లోక్సభ ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్ సందేశ్ఖాలీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఆ ప్రాంతంలోని మహిళలపై మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరుల లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటన వెలుగులోకి వచ్చింది. వీరిని అరెస్ట్ చేయాలని అక్కడి మహిళలు పెద్ద ఉద్యమం చేశారు. అయితే, సందేశ్ఖాలీ హింసాకాండ, దోపిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై దాఖలైన అఫిడవిట్ని గురువారం కలకత్తా హైకోర్టు విచారించింది. బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్కి రక్షణ కల్పించారని తృణమూల్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చీఫ్ జస్టిన్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం సర్కార్ని మందలించింది. ‘‘ఒక్క అఫిడవిట్ కరెక్ట్ అయినా, ఇది సిగ్గు చేటు. ఇందులో ఒక్క శాతం నిజమున్న 100 శాతం సిగ్గుపడాల్సిన విషయం. పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితమైందా..?’’ అని అన్నారు. మొత్తం జిల్లా యంత్రాంగంతో పాటు అధికార పార్టీ 100 శాతం నైతిక బాధ్యత కలిగి ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
Read Also: DMK: జనరల్ బిపిన్ రావత్ చనిపోతే ప్రధాని ఎందుకు రాలేదు.. ఏ.రాజా విమర్శలు..
షేక్ షాజహాన్ తరుపున వాదిస్తున్న లాయర్ని కోర్టు తీవ్రంగా మందలించింది. ఈ కేసులో నిందితుడు 55 రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు, చివరకు హైకోర్టు కలుగజేసుకుని, అతడిని అరెస్ట్ చేసే అధికారం ఈడీ, సీబీఐలకు ఉందని చెప్పిన తర్వాత, బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘55 రోజులు పరారీలో ఉన్నాడు. దాగుడు మూతలు ఆడారు. మీరు కళ్లు మూసుకుంటే ప్రపంచం చీకటిగా మారదు’’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. షాజహాన్ తరపు న్యాయవాది స్పందిస్తూ: “బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగా, నేను పరారీలో ఉన్నానని చెప్పారు.” అంతకుముందు విచారణలో బెంగాల్ పోలీసులు పూర్తిగా పక్షపాతంలో వ్యవహరించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
లోక్సభ ఎన్నికల ముందు సందేశ్ఖాలీ వివాదం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. మాజీ టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు అక్రమ రేషన్ కుంభకోణంలో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై షాజహాన్ గుండాలు దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి మహిళలు దీనిపై ఉద్యమించారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని 55 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. టీఎంసీ ఇతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..