Supreme Court: తమిళనాడు గవర్నర్ కోర్టును ధిక్కరిస్తున్నాడు.. కేంద్రం ఏం చేస్తుందని సుప్రీం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్కి రేపటి వరకు సమయం ఇచ్చింది.
అక్రమ ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు పొన్ముడిని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అతని నేరాన్ని, రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు నిలిపేసింది. తమిళనాడులో అధికార డీఎంకే అతడిని మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే, గవర్నర్ రవి దీనికి అంగీకరించకపోవడం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
Also Read
Read Also: Pakistan: పాకిస్థాన్పై నిషేధం!.. ముస్లిం దేశాలు ఎందుకు వీసా ఇవ్వడం లేదంటే?
‘‘రేపు మీ వ్యక్తి మాట వినకుంటే.. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని గవర్నర్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం. తమిళనాడు గవర్నర్ ప్రవర్తనపై తాము ఆందోళన చెందుతున్నాము. మేము కళ్లు తెరిచే ఉన్నాము, రేపు ఏం జరగాలో నిర్ణయిస్తాం’’ అని ప్రధాని న్యాయమూర్తి చంద్రచూడ్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ సుప్రీంకోర్టుని ధిక్కరిస్తున్నారని అన్నారు. ‘‘ నాకు ఒక మనిషి(మంత్రి)పై భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు, కీనా మనం రాజ్యాంగ చట్టానికి లోబడి వెళ్లాలి. సీఎం ఆ వ్యక్తిని మంత్రిగా నియమించాలని అనుకుంటున్నారు. గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దీనిని చేయాలి. ఆయన రాష్ట్రానికి ఉత్సవ అధిపతి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారి శిక్షపై స్టే విధించిన తర్వాత మీరు కళంకితులని ఎలాంటి మచ్చలేదని చెప్పలేం అని జస్టిస్ పార్దీవాలా అన్నారు.
గవర్నర్ రవికి, స్టాలిన్ ప్రభుత్వానికి ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఆయనను తొలగించాలని డీఎంకే సర్కార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసింది. ఇక మంత్రిగా పొన్ముడి నియామకాన్ని అంగీకరించకపోవడంతో రాజ్భవన్, సర్కార్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజ్భవన్ బిల్లుల క్లియరింగ్లో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?