Supreme Court: తమిళనాడు గవర్నర్ కోర్టును ధిక్కరిస్తున్నాడు.. కేంద్రం ఏం చేస్తుందని సుప్రీం ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్కి రేపటి వరకు సమయం ఇచ్చింది.
అక్రమ ఆస్తుల కేసులో మద్రాసు హైకోర్టు పొన్ముడిని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అతని నేరాన్ని, రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు నిలిపేసింది. తమిళనాడులో అధికార డీఎంకే అతడిని మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే, గవర్నర్ రవి దీనికి అంగీకరించకపోవడం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
Read Also: Pakistan: పాకిస్థాన్పై నిషేధం!.. ముస్లిం దేశాలు ఎందుకు వీసా ఇవ్వడం లేదంటే?
‘‘రేపు మీ వ్యక్తి మాట వినకుంటే.. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని గవర్నర్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం. తమిళనాడు గవర్నర్ ప్రవర్తనపై తాము ఆందోళన చెందుతున్నాము. మేము కళ్లు తెరిచే ఉన్నాము, రేపు ఏం జరగాలో నిర్ణయిస్తాం’’ అని ప్రధాని న్యాయమూర్తి చంద్రచూడ్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ సుప్రీంకోర్టుని ధిక్కరిస్తున్నారని అన్నారు. ‘‘ నాకు ఒక మనిషి(మంత్రి)పై భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు, కీనా మనం రాజ్యాంగ చట్టానికి లోబడి వెళ్లాలి. సీఎం ఆ వ్యక్తిని మంత్రిగా నియమించాలని అనుకుంటున్నారు. గవర్నర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో దీనిని చేయాలి. ఆయన రాష్ట్రానికి ఉత్సవ అధిపతి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కసారి శిక్షపై స్టే విధించిన తర్వాత మీరు కళంకితులని ఎలాంటి మచ్చలేదని చెప్పలేం అని జస్టిస్ పార్దీవాలా అన్నారు.
గవర్నర్ రవికి, స్టాలిన్ ప్రభుత్వానికి ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఆయనను తొలగించాలని డీఎంకే సర్కార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసింది. ఇక మంత్రిగా పొన్ముడి నియామకాన్ని అంగీకరించకపోవడంతో రాజ్భవన్, సర్కార్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజ్భవన్ బిల్లుల క్లియరింగ్లో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజావార్తలు
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..