Hemang Joshi : చిన్న వయసులోనే బీజేపీ ఎంపీ టికెట్ ఆయన ఎవరంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemang Joshi : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని సొంత రాష్ట్ర మైన గుజరాత్ లో బీజీపీ మరో యువ నాయకుడికి సీటు ఖరారు చేసింది. గుజరాత్లోని వడోదర టికెట్ ను 33 ఏళ్ల వయసున్న హేమాంగ్ జోషికి కేటాయించింది. జోషీ హోలీ సందర్భంగా ఓ సంగీత కార్యక్రమానికి హాజరవుతుండగా..ప్రముఖులు ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో వడోదర స్థానానికి బీజేపీ తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని అతడికి తెలిసింది. అసలు ఏమైందంటే..
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర స్థానానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా రంజన్ భట్ ఉన్నారు. రెండుసార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన ఆమెకు ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సీటు కేటాయించారు. కాని రంజన్ భట్ వ్యక్తి గత కారణాలతో ఉన్నపలంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆలోచనలో పడ్డ పార్టీ అగ్రనాయకులు మాజీ విద్యార్థి నాయకుడు, 33 ఏళ్ల యువకుడైన జోషికి టికెట్ కేటాయించారు. రాష్ట్రంలో 26 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థల్లో పిన్న వయస్కుడు జోషీనే.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం మరియు పారిశ్రామిక అభివృద్ధికి పేరుగాంచిన పూర్వపు రాచరిక ప్రాంతమైన వడోదర నుండి 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీ పోటీ చేశారు. యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసిన ఆయన రెండుచోట్ల విజయం సాధించడంతో వడోదర స్థానాన్ని రంజన్ భట్కు కేటాయించారు.
ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యువ బీజేపీ నాయకుడు మాట్లాడుతూ.. 10 లక్షల ఓట్ల తేడాతో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తనకు టిక్కెట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని, చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని యువ ఓటర్ల మద్దతుతో తాను పనిచేస్తున్నానని చెప్పారు. విద్యార్థి నాయకుడు జోషి 10 లక్షల ఓట్ల తేడాతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మీడియా ప్లాట్ఫాం ఫాక్స్ స్టోరీ ఇండియా రూపొందించిన 40 ఏళ్లలోపు భారతదేశపు 40 మంది యువ నాయకుల జాబితాలో జోషికి స్థానం దక్కింది.
దరలో కొనసాగుతున్న అశాంతి కారణంగా పార్టీ ఆమెను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించిందా అని అడిగిన ప్రశ్నకు, “పార్టీ నాకు మూడవసారి టికెట్ ఇచ్చింది; వారు నాకు పోటీ చేసే అవకాశాన్ని నిరాకరించలేదు కాబట్టి వారు నన్ను ఎందుకు ఉపసంహరించుకోవాలని అడుగుతారు?
తాజావార్తలు
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!