Maharashtra Rains: ముంబయిలో భారీ వర్షాలు.. పాల్ఘర్, థానేలో స్కూళ్లకు సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Rains: ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముంబయికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. మహారాష్ట్రలోని పాల్ఘర్, థానేలోని పాఠశాలలను మూసివేసింది. గురువారం వరకు ముంబయిలో 90 శాతానికి పైగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 13 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమై దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికి ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్రలోని పాల్ఘర్, థానేలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు.
Read also: Delhi: ఇద్దరు కలిసి అక్కడకు వెళ్లేవారు.. ఇంతలోనే హఠాత్ పరిణామాలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
శుక్రవారం ఉదయం 8:30 గంటలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబయికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే, పలు ప్రాంతాలకు ‘రెడ్’ అలర్ట్ జారీ చేసింది. ముంబయి నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్లో పేర్కొంది. నీటిని సరఫరా చేసే ఏడు సరస్సుల్లో ఒకటైన మోదక్ సాగర్ సరస్సు గురువారం రాత్రి 10:52 గంటలకు ఉప్పొంగడం ప్రారంభమైంది. తులసి సరస్సు, వెహర్ సరస్సు, తాన్సా సరస్సుల తరువాత పొంగిపొర్లుతున్న నాల్గవ మంచినీటి సరస్సు ఇది. పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తాంసా డ్యామ్ ఉప్పొంగడంతో 15 గేట్లు ఎత్తి 1,65,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలోని ధమానీ డ్యామ్ నుంచి 8,400 క్యూసెక్కులు, కవదాస్ డ్యామ్ నుంచి 21,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం కురిసిన భారీ వర్షానికి పలు కుటుంబాలు జలమయం కావడంతో పలు నివాస ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. థానే జిల్లాలోని కల్వా పట్టణంలోని వాగు సమీపంలో భారీ వర్షాల మధ్య చేపలు పట్టేందుకు వెళ్లిన 32 ఏళ్ల వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు థానే జిల్లాలోని భివాండి, మీరా భయందర్ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పాల్ఘర్ జిల్లాలోని వసాయి, విరార్ ప్రాంతాలు సైతం నీట మునిగాయి. ముంబయిలో గురువారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పశ్చిమ-మధ్య రైల్వేల సబర్బన్ రైలు సేవలు ఆలస్యం అయ్యాయి. జూలై 29 వరకు కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో తేలికపాటి నుండి భారీ, అతి భారీ వర్షపాతం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. ముంబై నగరం పరిసర ప్రాంతాలలో నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!