Navya Haridas: వయనాడ్ బైపోల్లో విజయం తనదేనన్న నవ్య హరిదాస్
- వయనాడ్ బైపోల్లో విజయం తనదేనన్న నవ్య హరిదాస్
- బుధవారం నామినేషన్ వేయనున్న ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే వయనాడ్ బైపోల్ మాత్రం రసవత్తరంగా మారింది. ఇక్కడ తొలిసారి ప్రియాంకాగాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేయడమే కారణం. దీంతో వయనాడ్ దేశ వ్యాప్తంగా ఫోకస్ అవుతోంది. ఇక బుధవారం భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి ప్రియాంక నామినేషన్ వేయనున్నారు. ఆమె వెంట తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఉండనున్నారు.
ఇదిలా ఉంటే ప్రియాంకపై బీజేపీ కూడా గట్టి అభ్యర్థినే రంగంలోకి దింపింది. నవ్య హరిదాస్ అనే కౌన్సిలర్ను బరిలోకి దింపింది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడింది. ప్రజాప్రతినిధిగా ప్రియాంక కంటే తనకే ఎక్కువ రాజకీయ జీవితం ఉందని, ఈ ఎన్నికల్లో తనదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
ప్రియాంకకు నెహ్రూ కుటుంబ నేపథ్యం ఉన్నందున జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. కానీ ఇది ఆమెకు తొలి ఎన్నిక అని చెప్పారు. మరోవైపు కొయ్కోడ్ కౌన్సిలర్గా వరుసగా రెండుసార్లు పనిచేశానని. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసినట్లు నవ్య తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నందున.. ప్రియాంకపై పోటీ చేయడం భిన్నంగా ఏమీ అనిపించడం లేదన్నారు. ఆమె కంటే నాకే ఎక్కువ రాజకీయ అనుభవం ఉందని భావిస్తున్నట్లు నవ్య హరిదాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యం వల్ల ఈ ఎన్నిక అనివార్యమైందని, సోదరి కోసం వయనాడ్ను రాహుల్ వదిలేశారని విమర్శించారు. కుటుంబ ఆధిపత్యానికి ఇదో ఉదాహరణ అని.. ఇదే అంశాన్ని ఓటర్ల ముందుకు తీసుకెళ్తానని నవ్య చెప్పుకొచ్చారు.
గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. కుటుంబానికి కంచుకోట అయిన రాయ్బరేలీ స్థానాన్ని ఉంచుకుని వయనాడ్ను వదులుకున్నారు. దీంతో వయనాడ్లో బైపోల్ వచ్చింది. ముందుగానే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. వయనాడ్లో ప్రియాంక పోటీ చేస్తుందని ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె పేరును ప్రకటించారు. ఇక నవంబర్ 13న వయనాడ్లో ఉపఎన్నిక జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!