Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు
- హత్రాస్ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు అరెస్ట్
- ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ సమాచారమిస్తే లక్ష రూపాయల రివార్డు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hathras Stampede: హత్రాస్లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం హత్రాస్లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు.
Read Also: Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
అలీఘర్ ఇన్స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారంతా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, సేవదార్లుగా పనిచేశారని వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో ‘ముఖ్య సేవాదార్’ దేవ్ ప్రకాష్ మధుకర్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మధుకర్పై సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు. మధుకర్ అరెస్ట్ కోసం పోలీసులు కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బాబా అరెస్టుపై శలభ్ మాథుర్ ఏమన్నారు?
బాబా అరెస్ట్పై ఐజీ శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ఈరోజు ఆరుగురిని అరెస్టు చేశామని, అయితే దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఎవరిని అరెస్టు చేయాలో దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని అన్నారు. విచారణలో భోలే బాబా పాత్ర ఉన్నట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకుని అరెస్టు చేస్తామన్నారు. అవసరమైతే, అధికారులు ‘భోలే బాబా’ని కూడా ప్రశ్నించవచ్చు. ఆయన పేరును మాత్రం ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు. కానీ విచారణకు అనుమతి ఉంది. నారాయణ్ సకార్ హరి నేపథ్యంపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయనపై నేరారోపణలు ఉన్న నగరాలకు బృందాలను పంపించారు.
Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం
పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ కార్యక్రమానికి 80,000 మందికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ, 2.50 లక్షల మందికి పైగా ప్రజలు మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక ప్రకారం, వేలాది మంది అనుచరులు ఆశీర్వాదం కోసం, బోధకుడి పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించడానికి వెళుతుండగా, వారిని భోలే బాబా భద్రతా సిబ్బంది నెట్టారు. దాని కారణంగా , చాలా మంది కింద పడిపోయారు, ఫలితంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటన వెనుక వ్యతిరేక శక్తులు ఉన్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం భోలే బాబా ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!