Ashok Khemka: 8 నిమిషాల పని.. 40 లక్షల జీతం.. వద్దంటోన్న ఐఏఎస్ ఆఫీసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana IAS officer Ashok Khemka Writes A Letter To CM Seeks Vigilance Department Posting: రోజుకు 8 నిమిషాలు మాత్రమే పని.. అంతకుమించి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ చిన్న పనికి జీతం అక్షరాల రూ. 40 లక్షలు (సంవత్సరానికి). బహుశా ప్రపంచంలోనే ఇలాంటి అత్యంత సౌకర్యవంతమైన ఉద్యోగం ఉండదు. ఇటువంటి బంపరాఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తనకు ఈ ఉద్యోగం వద్దని చెప్తున్నారు. ఆయన పేరు అశోక్ ఖేమ్కా. తనకు అవినీతిని నిర్మూలించేందుకు స్టేట్ విజిలెన్స్ విభాగం అధిపతిగా బాధ్యతలు అప్పగించాలని కోరుతూ.. హరియాణా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.
Twitter: ఎలాన్ మస్క్కి ఊహించని షాక్.. ట్విటర్పై విజిల్ బ్లోయర్ బాంబ్
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
తన 30 ఏళ్ల కెరీర్లో ఖేమ్కా 55 సార్లు బదిలీ అయ్యారు. ఈయన ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిగా గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఖేమ్కాకు.. అదే హోదాతో ఆర్కైవ్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది ఆయనకు 56వ బదిలీ. తనకు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడంతో.. హరియాణా ప్రభుత్వానికి ఆయన ఈనెల 23న ఓ లేఖ రాశారు. ‘‘జనవరి 9న నన్ను ఆర్కైవ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. ఈ విభాగం వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు. అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాకు సంవత్సరానికి గాను రూ. 40 లక్షల జీతం ఇస్తున్నారు. అంటే.. ఆర్కైవ్స్ విభాగానికి కేటాయించిన బడ్జెట్లో 10% నా జీతానికి వెళ్తుంది. ఇక్కడ వారం మొత్తంలో గంటకు మించి పని ఉండదు. ఇతర అధికారులకు మాత్రం తలకు మించిన పని ఉంటోంది. ఇలా కొందరికి పనిలేకుండా, మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
T.S. High Court : రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందే
అంతేకాదు.. అవినీతిని చూసినప్పుడు తన మనసు తల్లడిల్లుతుందని, వ్యవస్థకు పట్టిన క్యాన్సర్ను వదిలించాలనే తపనతోనే తాను తన కెరీర్ను పణంగా పెట్టానని ఖేమ్కా తెలిపారు. అవినీతిని పారదోలే విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమైందని.. కెరీర్ చివరి దశలో ఉన్న తాను ఈ విభాగంలో సేవలు అందించాలని అనుకుంటున్నానని కోరారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా.. ఆర్కైవ్స్ శాఖలో ఆయన పనిచేయడం ఇది నాలుగోసారి. 2025లో ఖేమ్కా పదవీ విరమణ చేయనున్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..