Ashok Khemka: 8 నిమిషాల పని.. 40 లక్షల జీతం.. వద్దంటోన్న ఐఏఎస్ ఆఫీసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana IAS officer Ashok Khemka Writes A Letter To CM Seeks Vigilance Department Posting: రోజుకు 8 నిమిషాలు మాత్రమే పని.. అంతకుమించి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ చిన్న పనికి జీతం అక్షరాల రూ. 40 లక్షలు (సంవత్సరానికి). బహుశా ప్రపంచంలోనే ఇలాంటి అత్యంత సౌకర్యవంతమైన ఉద్యోగం ఉండదు. ఇటువంటి బంపరాఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తనకు ఈ ఉద్యోగం వద్దని చెప్తున్నారు. ఆయన పేరు అశోక్ ఖేమ్కా. తనకు అవినీతిని నిర్మూలించేందుకు స్టేట్ విజిలెన్స్ విభాగం అధిపతిగా బాధ్యతలు అప్పగించాలని కోరుతూ.. హరియాణా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.
Twitter: ఎలాన్ మస్క్కి ఊహించని షాక్.. ట్విటర్పై విజిల్ బ్లోయర్ బాంబ్
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
తన 30 ఏళ్ల కెరీర్లో ఖేమ్కా 55 సార్లు బదిలీ అయ్యారు. ఈయన ఎక్కువసార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారిగా గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఖేమ్కాకు.. అదే హోదాతో ఆర్కైవ్స్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది ఆయనకు 56వ బదిలీ. తనకు ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావడంతో.. హరియాణా ప్రభుత్వానికి ఆయన ఈనెల 23న ఓ లేఖ రాశారు. ‘‘జనవరి 9న నన్ను ఆర్కైవ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. ఈ విభాగం వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు. అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నాకు సంవత్సరానికి గాను రూ. 40 లక్షల జీతం ఇస్తున్నారు. అంటే.. ఆర్కైవ్స్ విభాగానికి కేటాయించిన బడ్జెట్లో 10% నా జీతానికి వెళ్తుంది. ఇక్కడ వారం మొత్తంలో గంటకు మించి పని ఉండదు. ఇతర అధికారులకు మాత్రం తలకు మించిన పని ఉంటోంది. ఇలా కొందరికి పనిలేకుండా, మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
T.S. High Court : రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించాల్సిందే
అంతేకాదు.. అవినీతిని చూసినప్పుడు తన మనసు తల్లడిల్లుతుందని, వ్యవస్థకు పట్టిన క్యాన్సర్ను వదిలించాలనే తపనతోనే తాను తన కెరీర్ను పణంగా పెట్టానని ఖేమ్కా తెలిపారు. అవినీతిని పారదోలే విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమైందని.. కెరీర్ చివరి దశలో ఉన్న తాను ఈ విభాగంలో సేవలు అందించాలని అనుకుంటున్నానని కోరారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా.. ఆర్కైవ్స్ శాఖలో ఆయన పనిచేయడం ఇది నాలుగోసారి. 2025లో ఖేమ్కా పదవీ విరమణ చేయనున్నారు.
తాజావార్తలు
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!