Gyanvapi Mosque case: జ్ఞానవాపి కేసుపై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలిచ్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court On Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన అప్పీల్ ను అక్టోబర్ మొదటివారానికి వాయిదా వేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు హిందూ మహిళలు వేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం జ్ఞానవాపి మసీదు కేసును విచారించింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి కోర్టులో విచారణ జరుగుతుందని.. కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉంటే మసీదులో బయటపడిన శివలింగానికి జలాభిషేకం చేయడానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించడానికి నిరాకరించింది. ఈ కేసు ఇప్పటికే వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా కొత్తగా దావాను తీసుకోలేమని వెల్లడించింది. శ్రావణ మాసం ప్రారంభం అవుతున్న క్రమంలో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు అయింది.. అయితే దీన్ని కోర్టు విచారించేందుకు నిరాకరించింది. దీంతో పాటు మసీదులో కనుకున్న శివలింగాన్ని కార్బన్ డేటింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే కోరుతూ ఏడుగురు మహిళలు దాఖలు చేసిన మరో పిటిషన్ స్వీకరించడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
Read aAlso: National Herald Case: ముగిసిన సోనియాగాంధీ తొలి రోజు విచారణ..75 మంది కాంగ్రెస్ ఎంపీల అరెస్ట్
గతంలో అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు అనుమతించింది. ఆ సమయంలోనే మసీదులోని వాజూఖానాలోని ఒక బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడటంతో పాటు మసీదులో గోడలపై పలు రకాల హిందు చిహ్నాలు కనిపించాయి. అయితే ఈ వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీం కోర్టులను ఆశ్రయించింది. మే 17ను సుప్రీం కోర్టు ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శివలింగం కనుగొనబడిన ప్రాంతాన్ని రక్షించడంతో పాటు నమాజ్ కో్సం ముస్లింలకు ప్రవేశాన్ని కల్పించాలని ఆదేశించింది. మే 20న ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!