Gyanvapi Mosque case: జ్ఞానవాపి కేసుపై సుప్రీంలో విచారణ.. కీలక ఆదేశాలిచ్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court On Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు సుప్రీం కోర్టు విచారించింది. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన అప్పీల్ ను అక్టోబర్ మొదటివారానికి వాయిదా వేస్తూ గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు హిందూ మహిళలు వేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం జ్ఞానవాపి మసీదు కేసును విచారించింది. ప్రస్తుతం ఈ కేసు వారణాసి కోర్టులో విచారణ జరుగుతుందని.. కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉంటే మసీదులో బయటపడిన శివలింగానికి జలాభిషేకం చేయడానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ స్వీకరించడానికి నిరాకరించింది. ఈ కేసు ఇప్పటికే వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా కొత్తగా దావాను తీసుకోలేమని వెల్లడించింది. శ్రావణ మాసం ప్రారంభం అవుతున్న క్రమంలో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు అయింది.. అయితే దీన్ని కోర్టు విచారించేందుకు నిరాకరించింది. దీంతో పాటు మసీదులో కనుకున్న శివలింగాన్ని కార్బన్ డేటింగ్ చేయడంతో పాటు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే కోరుతూ ఏడుగురు మహిళలు దాఖలు చేసిన మరో పిటిషన్ స్వీకరించడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది.
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
Read aAlso: National Herald Case: ముగిసిన సోనియాగాంధీ తొలి రోజు విచారణ..75 మంది కాంగ్రెస్ ఎంపీల అరెస్ట్
గతంలో అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వేకు అనుమతించింది. ఆ సమయంలోనే మసీదులోని వాజూఖానాలోని ఒక బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడటంతో పాటు మసీదులో గోడలపై పలు రకాల హిందు చిహ్నాలు కనిపించాయి. అయితే ఈ వీడియోగ్రఫీ సర్వేను ఛాలెంజ్ చేస్తే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీం కోర్టులను ఆశ్రయించింది. మే 17ను సుప్రీం కోర్టు ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శివలింగం కనుగొనబడిన ప్రాంతాన్ని రక్షించడంతో పాటు నమాజ్ కో్సం ముస్లింలకు ప్రవేశాన్ని కల్పించాలని ఆదేశించింది. మే 20న ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!